భారీ వర్షాలు..అమరనాథ్ యాత్రకు తాత్కాలిక విరామం
- July 07, 2023
శ్రీనగర్: గత రాత్రి నుంచి జమ్ముకశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు పోటెత్తాయి. దాంతో అమరనాథ్ యాత్రకు శుక్రవారం తాత్కాలిక బ్రేక్ పడింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్తాల్, పహల్గాం రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంత భారీ వర్షంలో పవిత్ర అమరనాథ్ గుహలోకి యాత్రికులు వెళ్లడం కష్టమన్నారు. అందుకే 3,200 మంది యాత్రికులను నున్వాన్ పహల్గామ్ క్యాంపు దగ్గర, 4,000 మంది యాత్రికులను బల్తాల్ క్యాంపు దగ్గర నిలిపివేశామని చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత యాత్రను పునఃప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 80 వేల మంది భక్తులు అమరనాథ్ యాత్రను పూర్తి చేసుకున్నారు.
అయితే, జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నెల 8, 9 తేదీల్లో కూడా కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా, 8వ బ్యాచ్కు చెందిన 7,010 మంది యాత్రికులు శుక్రవారం బఘ్వతి నగర్ బేస్ క్యాంపు నుంచి 247 వాహనాల్లో జమ్ము నుంచి కశ్మీర్ లోయకు బయలుదేరారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









