పౌరులకు 3,200 ల్యాండ్ ప్లాట్లు కేటాయింపు
- July 10, 2023
దుబాయ్: దుబాయ్లోని ఎమిరాటీ పౌరులకు 3,200 ల్యాండ్ ప్లాట్లను దుబాయ్ మునిసిపాలిటీ కేటాయించింది. పౌరులకు అత్యున్నత నాణ్యమైన జీవితాన్ని అందించాలనే దుబాయ్ పాలకుల దృష్టిలో భాగంగా, ఈ రెసిడెన్షియల్ ప్లాట్లను ప్రకటించినట్టు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇది ఎమిరాటీ పౌరులకు సరియైన జీవన ప్రమాణాలను పెంపొందించడానికి యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యొక్క దార్శనికత అమలు చేయడంలో భాగంగా ప్లాట్లను పంపిణీ చేసినట్లు వివరించారు. ల్యాండ్ ప్లాట్ల కేటాయింపు దుబాయ్లోని హయ్యర్ కమిటీ ఫర్ డెవలప్మెంట్ అండ్ సిటిజన్స్ అఫైర్స్ సమగ్ర సిటిజన్ హౌసింగ్ ప్లాన్ల ప్రకారం అమలు చేయబడుతుందని, దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్కు మద్దతు ఇస్తుందన్నారు. ఇది దుబాయ్లో స్థిరమైన పట్టణ అభివృద్ధిని సాధించడం, దుబాయ్ మరియు దానిలో జీవన నాణ్యతను, పోటీతత్వాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









