పౌరులకు 3,200 ల్యాండ్ ప్లాట్లు కేటాయింపు

- July 10, 2023 , by Maagulf
పౌరులకు 3,200 ల్యాండ్ ప్లాట్లు కేటాయింపు

దుబాయ్: దుబాయ్‌లోని ఎమిరాటీ పౌరులకు 3,200 ల్యాండ్ ప్లాట్లను దుబాయ్ మునిసిపాలిటీ కేటాయించింది. పౌరులకు అత్యున్నత నాణ్యమైన జీవితాన్ని అందించాలనే దుబాయ్ పాలకుల దృష్టిలో భాగంగా, ఈ రెసిడెన్షియల్ ప్లాట్‌లను ప్రకటించినట్టు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్  ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇది ఎమిరాటీ పౌరులకు సరియైన జీవన ప్రమాణాలను పెంపొందించడానికి యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యొక్క దార్శనికత అమలు చేయడంలో భాగంగా ప్లాట్లను పంపిణీ చేసినట్లు వివరించారు. ల్యాండ్ ప్లాట్ల కేటాయింపు దుబాయ్‌లోని హయ్యర్ కమిటీ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ సిటిజన్స్ అఫైర్స్ సమగ్ర సిటిజన్ హౌసింగ్ ప్లాన్‌ల ప్రకారం అమలు చేయబడుతుందని, దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్‌కు మద్దతు ఇస్తుందన్నారు. ఇది దుబాయ్‌లో స్థిరమైన పట్టణ అభివృద్ధిని సాధించడం, దుబాయ్ మరియు దానిలో జీవన నాణ్యతను, పోటీతత్వాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com