సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథ..

- May 14, 2016 , by Maagulf
సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథ..

సందీప్‌, భవ్యశ్రీ, రణధీర్‌, కోమలి నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'నేను సీతాదేవి'. శ్రీనివాస్‌ మల్లం దర్శకుడు. చిటుకుల సందీప్‌ నిర్మాత. చైతన్య రాజా స్వరాలందించారు. ఇటీవల హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేశారు. ఎమ్మెస్‌ రాజు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ '' సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథ ఇది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమా బాగా వచ్చింది'' అని అన్నారు. ''చైతన్య చక్కని పాటలందించారు. సునీల్‌ కశ్యప్‌ నేపథ్య సంగీతం, శివ ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి'' అని నిర్మాత చెప్పారు. పాశం యాదగిరి, రణధీర్‌, కోమలి, భవ్యశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com