సౌదీ అరేబియాలో జూలై 19న జీసీసీ-మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశం
- July 14, 2023
జెడ్డా: సౌదీ అరేబియా జూలై 19న జెడ్డాలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ), మధ్య ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ రాబోయే శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా జీసీసీ-మధ్య ఆసియాలలోని అన్ని దేశాల నాయకులకు ఆహ్వానాలు పంపారు.
కువైట్లోని సౌదీ రాయబారి ప్రిన్స్ సుల్తాన్ బిన్ సాద్ కువైట్ క్రౌన్ ప్రిన్స్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్కు కింగ్ సల్మాన్ నుండి కువైట్ ఎమిర్కు ఆహ్వానాన్ని అందజేశారు. అలాగే కజకిస్థాన్ అధ్యక్షుడు కసిమ్-జోమార్ట్ టోకాయేవ్కు కూడా రాజు సల్మాన్ ఆహ్వానం పంపారు. అదేవిధంగా మధ్య ఆసియా దేశాలలో కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







