సౌదీ అరేబియాలో జూలై 19న జీసీసీ-మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశం

- July 14, 2023 , by Maagulf
సౌదీ అరేబియాలో జూలై 19న జీసీసీ-మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశం

జెడ్డా: సౌదీ అరేబియా జూలై 19న జెడ్డాలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ),  మధ్య ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ రాబోయే శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా  జీసీసీ-మధ్య ఆసియాలలోని అన్ని దేశాల నాయకులకు ఆహ్వానాలు పంపారు.

కువైట్‌లోని సౌదీ రాయబారి ప్రిన్స్ సుల్తాన్ బిన్ సాద్ కువైట్ క్రౌన్ ప్రిన్స్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్‌కు కింగ్ సల్మాన్ నుండి కువైట్ ఎమిర్‌కు ఆహ్వానాన్ని అందజేశారు. అలాగే కజకిస్థాన్ అధ్యక్షుడు కసిమ్-జోమార్ట్ టోకాయేవ్‌కు కూడా రాజు సల్మాన్ ఆహ్వానం పంపారు. అదేవిధంగా మధ్య ఆసియా దేశాలలో కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com