కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
- July 18, 2023
న్యూఢిల్లీ: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున 4.25 గంటలకు బెంగళూరులోని చిన్మయ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 79. గతకొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కొట్టాయం జిల్లాలోని పుత్తుపల్లి నియోజకవర్గానికి ఊమెన్ చాందీ 50 ఏళ్లకు పైగా ప్రాతినిధ్యం వహించారు.
1970లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాందీ తొలిసారిగా పుత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించారు. 1977లో కె కరుణాకరన్ కేబినెట్లో తొలిసారిగా మంత్రి అయ్యాడు. 2004 – 2006, 2011-2016 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి మృతి పట్ల కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె సుధాకరన్ సంతాపం తెలిపారు. ఈ రోజు ఒక లెజెండ్ ఊమెన్ చాందీని కోల్పోయినందుకు నేను చాలా బాధపడ్డాను. మన ఆత్మల్లో ఎప్పటికీ ఆయన మాటలు ప్రతిధ్వనిస్తుంటాయి అని సుధాకరన్ ట్వీట్ చేశారు. ఊమెన్ చాందీకి భార్య మరియమ్మ, పిల్లలు మరియా ఊమెన్, చాందీ ఊమెన్, అచ్చు ఊమెన్ ఉన్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







