కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
- July 18, 2023
న్యూఢిల్లీ: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున 4.25 గంటలకు బెంగళూరులోని చిన్మయ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 79. గతకొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కొట్టాయం జిల్లాలోని పుత్తుపల్లి నియోజకవర్గానికి ఊమెన్ చాందీ 50 ఏళ్లకు పైగా ప్రాతినిధ్యం వహించారు.
1970లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాందీ తొలిసారిగా పుత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించారు. 1977లో కె కరుణాకరన్ కేబినెట్లో తొలిసారిగా మంత్రి అయ్యాడు. 2004 – 2006, 2011-2016 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి మృతి పట్ల కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె సుధాకరన్ సంతాపం తెలిపారు. ఈ రోజు ఒక లెజెండ్ ఊమెన్ చాందీని కోల్పోయినందుకు నేను చాలా బాధపడ్డాను. మన ఆత్మల్లో ఎప్పటికీ ఆయన మాటలు ప్రతిధ్వనిస్తుంటాయి అని సుధాకరన్ ట్వీట్ చేశారు. ఊమెన్ చాందీకి భార్య మరియమ్మ, పిల్లలు మరియా ఊమెన్, చాందీ ఊమెన్, అచ్చు ఊమెన్ ఉన్నారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









