కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
- July 18, 2023
న్యూఢిల్లీ: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున 4.25 గంటలకు బెంగళూరులోని చిన్మయ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 79. గతకొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కొట్టాయం జిల్లాలోని పుత్తుపల్లి నియోజకవర్గానికి ఊమెన్ చాందీ 50 ఏళ్లకు పైగా ప్రాతినిధ్యం వహించారు.
1970లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాందీ తొలిసారిగా పుత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించారు. 1977లో కె కరుణాకరన్ కేబినెట్లో తొలిసారిగా మంత్రి అయ్యాడు. 2004 – 2006, 2011-2016 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి మృతి పట్ల కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె సుధాకరన్ సంతాపం తెలిపారు. ఈ రోజు ఒక లెజెండ్ ఊమెన్ చాందీని కోల్పోయినందుకు నేను చాలా బాధపడ్డాను. మన ఆత్మల్లో ఎప్పటికీ ఆయన మాటలు ప్రతిధ్వనిస్తుంటాయి అని సుధాకరన్ ట్వీట్ చేశారు. ఊమెన్ చాందీకి భార్య మరియమ్మ, పిల్లలు మరియా ఊమెన్, చాందీ ఊమెన్, అచ్చు ఊమెన్ ఉన్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







