జీవిత, రాజశేఖర్లకు ఏడాది జైలు
- July 19, 2023
హైదరాబాద్: యాంగ్రీ యంగ్మ్యాన్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవితలకు కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రముఖ నిర్మాత అరవింద్ పరువునష్టం కేసు, జీవిత రాజశేఖర్ లకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011 లో జీవిత రాజశేఖర్ ల మీద వేసిన పరువు నష్టం కేసు దాఖలు చేయగా... అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. ఈ దంపతులకి 17వ అదనపు చీఫ్ మెట్రో పోలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) కోర్టు ఒక ఏడాది జైలు శిక్ష, అయిదు వేల రూపాయలు జరిమానా విధించింది. జీవిత ఆమె భర్త రాజశేఖర్ దంపతులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్రీ గా రక్తం తెచ్చుకుంటూ, మార్కెట్ లో అమ్ముకుంటున్నారని 2011 సంవత్సరంలో రాజశేఖర్ దంపతులు విమర్శలు గుప్పించారు. అప్పట్లోనే ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ వారిద్దరిపై పరువునష్టం దావా వేశారు.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న మంచి పనుల మీద వీరిద్దరూ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆరోపిస్తూ అల్లు అరవింద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అప్పటినుంచి కేసు కొనసాగగా తాజాగా నాంపల్లి కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. రాజశేఖర్ దంపతులు వెంటనే జరిమానా చెల్లించటంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుపై పైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని కూడా చెప్పింది.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం