$50 బిలియన్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసిన యూఏఈ-టర్కీ

- July 21, 2023 , by Maagulf
$50 బిలియన్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసిన యూఏఈ-టర్కీ

యూఏఈ: $50.7 బిలియన్ల విలువైన ఒప్పందాలపై యూఏఈ  అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, టర్కిష్ రిపబ్లిక్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సంతకాలు చేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా సహకార మార్గాలు, వివిధ రంగాలలో దాని అభివృద్ధి స్థాయి గురించి చర్చించారు. ప్రస్తుత సంవత్సరంలో 2023లో రెండు దేశాలు సమగ్ర ఆర్థిక వ్యవస్థ కోసం పనిచేయాలని నిర్ణయించాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ యూఏఈలో అధికారిక పర్యటన సందర్భంగా అబుధాబిలోని కస్ర్ అల్ వతన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com