దుబాయ్ పర్యటనను రద్దు చేసుకుంటున్న భారతీయ పర్యాటకులు..!
- July 23, 2023
యూఏఈ: దుబాయ్ లో సెలవుదినాన్ని ఆస్వాదించాలని ఎదురు చూస్తున్న అనేక మంది భారతీయ పర్యాటకులు తమ స్వస్థలాల్లో నెలకొన్న వరదల కారణంగా వారి పర్యటనలను రద్దు చేసుకుంటున్నారని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు అనేక భారతీయ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడం, రహదారులను కొన్ని రాష్ట్రాల్లో సాధారణంగా మారింది.
ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అలోక్ కుమార్ తన కుటుంబాన్ని జూలై 18న దుబాయ్కు తీసుకెళ్లాల్సి ఉంది. అతని కుటుంబం, స్నేహితులతో పాటు, అతను ట్రావెల్ ఏజెంట్ ద్వారా ఫ్లైట్ టికెట్ ను, వసతిని బుక్ చేసుకున్నాడు. కానీ ఆగని వర్షం కారణంగా అన్ని ప్లాన్ లను రద్దు చేసుకున్నాడు. “నా స్నేహితులు, వారి కుటుంబాలు కాన్పూర్, భోపాల్ మరియు సూరత్ నుండి ఢిల్లీకి చేరుకోవలసి వచ్చింది. వరదల కారణంగా రైళ్లు, బస్సుల సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు నెలకొన్నాయి. కాబట్టి మేము మా ప్రణాళికతో ముందుకు సాగడం కష్టంగా ఉంది, ”అని కుమార్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







