$2 బిలియన్లకు చేరుకున్న ఒమన్, టర్కియే వాణిజ్యం
- July 23, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్, టర్కియే మధ్య వాణిజ్య మార్పిడి నిరంతర వృద్ధిని సాధిస్తోంది. 2022లో దాదాపు $2 బిలియన్లకు చేరుకుంది. 2017 నుండి సుల్తానేట్ ఆఫ్ ఒమన్, టర్కియే మధ్య వాణిజ్య పరిమాణం పెరుగుతూ 2022లో దాదాపు $2 బిలియన్ US డాలర్లకు చేరుకుందని అధికార యంత్రాంగం వెల్లడించింది. టర్కియో నుండి మొత్తం ఒమానీ దిగుమతులు $1.58 బిలియన్లు కాగా, టర్కియేకి మొత్తం ఒమానీ ఎగుమతులు $465 మిలియన్లకు చేరుకున్నాయి. ఒమన్ సుల్తానేట్కు రిపబ్లిక్ ఆఫ్ టర్కియే రాయబారి ముహమ్మత్ హెకిమోగ్లు మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రంగాలలో ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా గత పదేళ్లలో రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సహకారం గణనీయంగా పెరిగిందని చెప్పారు. డుక్మ్లోని ప్రత్యేక ఆర్థిక జోన్లో టర్కీ పారిశ్రామిక జోన్ను ఏర్పాటు చేయడానికి పని జరుగుతోందన్నారు. ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఉపాధి, ఆదాయం మరియు ఎగుమతి కోసం ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుందని, ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఆయన తెలిపారు. 2022లో టర్కియేను సందర్శించిన ఒమానీ పర్యాటకుల సంఖ్య 130,000 దాటిందన్నారు. రెండు దేశాలకు వీసాల అవసరాన్ని ఈ సంవత్సరం చివరిలోపు రద్దు అయ్యే అవకావం ఉందన్నారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కియే రాయబారి గత ఫిబ్రవరిలో 10 టర్కీ ప్రావిన్సులను తాకిన భూకంపం వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు ఒమన్ సుల్తానేట్ పంపిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







