1,744 మంది శరణార్థులకు చికిత్స అందించిన యూఏఈ
- July 23, 2023
యూఏఈ: చాద్లోని సూడానీస్ శరణార్థులకు మద్దతుగా యూఏఈ స్థాపించిన అమ్జారస్ ఆధారిత ఫీల్డ్ హాస్పిటల్ జులై 9 నుంచి 1,744 కేసులకు విజయవంతంగా చికిత్స అందించింది. ఇందులో మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి. ఆసుపత్రి ప్రారంభించినప్పటి నుండి 11 ఆపరేషన్లు చేయడంతో పాటు 173 ఆర్థోపెడిక్ కేసులు, 225 సర్జికల్, 1,346 అంతర్గత కేసులు వచ్చాయని ఆసుపత్రి వెల్లడించింది. గత ఏప్రిల్ నుండి కొనసాగుతున్న సుడాన్లో సంఘర్షణతో బాధపడుతున్న సూడానీస్ ప్రజలకు మద్దతుగా యూఏఈ మానవతా సహాయం మరియు వైద్య సహాయంలో ఈ ఆసుపత్రి ఒక భాగంగా ఉంది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







