1,744 మంది శరణార్థులకు చికిత్స అందించిన యూఏఈ

- July 23, 2023 , by Maagulf
1,744 మంది శరణార్థులకు చికిత్స అందించిన యూఏఈ

యూఏఈ: చాద్‌లోని సూడానీస్ శరణార్థులకు మద్దతుగా యూఏఈ స్థాపించిన అమ్‌జారస్ ఆధారిత ఫీల్డ్ హాస్పిటల్ జులై 9 నుంచి 1,744 కేసులకు విజయవంతంగా చికిత్స అందించింది. ఇందులో మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి.  ఆసుపత్రి ప్రారంభించినప్పటి నుండి 11 ఆపరేషన్లు చేయడంతో పాటు 173 ఆర్థోపెడిక్ కేసులు, 225 సర్జికల్, 1,346 అంతర్గత కేసులు వచ్చాయని ఆసుపత్రి వెల్లడించింది. గత ఏప్రిల్ నుండి కొనసాగుతున్న సుడాన్‌లో సంఘర్షణతో బాధపడుతున్న సూడానీస్ ప్రజలకు మద్దతుగా యూఏఈ మానవతా సహాయం మరియు వైద్య సహాయంలో ఈ ఆసుపత్రి ఒక భాగంగా ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com