పవన్ కళ్యాణ్ పై విజయవాడ సివిల్ కోర్టులో పిటిషన్
- July 24, 2023
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయవాడ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. పవన్ ఫై ఓ మహిళా వాలంటీర్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. పవన్ వ్యాఖ్యలతో తమను మానసికంగా వేధించారంటూ విజయవాడ వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా ఓ మహిళా వాలంటీర్ మాట్లాడుతూ.. తన లాయర్ ద్వారా పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. వాలంటీర్లుగా మహిళల డేటాను సేకరిస్తున్నారని, డేటాను దొంగిలించారని పవన్ అవాస్తవాలు ఆరోపించారని.., ఇది తన మనోభావాలను దెబ్బతీసిందని ఆమె ఆరోపించారు.
మహిళల అక్రమ రవాణాపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె అన్నారు. సేవ చేస్తూ వలంటీర్లపై ఆరోపణలు చేసిన పవన్ను చట్ట ప్రకారం శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాను ఒకే ఒక్క పిటిషన్ వేశానని, మరికొందరు తనను చూసిన తర్వాత వస్తారని తెలిపింది. సెక్షన్ 499, 00, 504, 505 కింద పవన్ పై కేసు పెట్టారు… బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత పవన్కు కోర్టు నోటీసులు జారీ చేస్తుందని, ఆ తర్వాత కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









