పవన్ కళ్యాణ్ పై విజయవాడ సివిల్ కోర్టులో పిటిషన్
- July 24, 2023
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయవాడ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. పవన్ ఫై ఓ మహిళా వాలంటీర్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. పవన్ వ్యాఖ్యలతో తమను మానసికంగా వేధించారంటూ విజయవాడ వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా ఓ మహిళా వాలంటీర్ మాట్లాడుతూ.. తన లాయర్ ద్వారా పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. వాలంటీర్లుగా మహిళల డేటాను సేకరిస్తున్నారని, డేటాను దొంగిలించారని పవన్ అవాస్తవాలు ఆరోపించారని.., ఇది తన మనోభావాలను దెబ్బతీసిందని ఆమె ఆరోపించారు.
మహిళల అక్రమ రవాణాపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె అన్నారు. సేవ చేస్తూ వలంటీర్లపై ఆరోపణలు చేసిన పవన్ను చట్ట ప్రకారం శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాను ఒకే ఒక్క పిటిషన్ వేశానని, మరికొందరు తనను చూసిన తర్వాత వస్తారని తెలిపింది. సెక్షన్ 499, 00, 504, 505 కింద పవన్ పై కేసు పెట్టారు… బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత పవన్కు కోర్టు నోటీసులు జారీ చేస్తుందని, ఆ తర్వాత కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







