యూఏఈ అధ్యక్షుడి సోదరుడు కన్నుమూత. 3 రోజులపాటు సంతాప దినాలు
- July 27, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోదరుడు, అబుధాబి పాలకుడి ప్రతినిధి షేక్ సయీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న షేక్ సయీద్ ఈరోజు కన్నుమూశారు. సోదరుడి మృతికి యూఏఈ అధ్యక్షుడు సంతాపాన్ని తెలియజేశారు. ప్రెసిడెన్షియల్ కోర్ట్ మూడు రోజుల పాటు అధికారిక సంతాపాన్ని ప్రకటించింది.
అల్ ఐన్లో 1965లో షేక్ సయీద్ జన్మించారు. జూన్ 2010లో అబుధాబి పాలకుడి ప్రతినిధిగా నియమితులయ్యారు. అబుధాబిలో ప్లానింగ్ విభాగానికి అండర్ సెక్రటరీగా వ్యవహారిస్తున్నారు. అతను షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ప్రతినిధిగా కూడా ఉన్నారు. అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ADCED) మాజీ సభ్యుడిగా.. షేక్ సయీద్ బిన్ జాయెద్ మారిటైమ్ పోర్ట్ అథారిటీ (అబుదాబి) ఛైర్మన్గా కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!









