యూఏఈ అధ్యక్షుడి సోదరుడు కన్నుమూత. 3 రోజులపాటు సంతాప దినాలు
- July 27, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోదరుడు, అబుధాబి పాలకుడి ప్రతినిధి షేక్ సయీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న షేక్ సయీద్ ఈరోజు కన్నుమూశారు. సోదరుడి మృతికి యూఏఈ అధ్యక్షుడు సంతాపాన్ని తెలియజేశారు. ప్రెసిడెన్షియల్ కోర్ట్ మూడు రోజుల పాటు అధికారిక సంతాపాన్ని ప్రకటించింది.
అల్ ఐన్లో 1965లో షేక్ సయీద్ జన్మించారు. జూన్ 2010లో అబుధాబి పాలకుడి ప్రతినిధిగా నియమితులయ్యారు. అబుధాబిలో ప్లానింగ్ విభాగానికి అండర్ సెక్రటరీగా వ్యవహారిస్తున్నారు. అతను షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ప్రతినిధిగా కూడా ఉన్నారు. అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ADCED) మాజీ సభ్యుడిగా.. షేక్ సయీద్ బిన్ జాయెద్ మారిటైమ్ పోర్ట్ అథారిటీ (అబుదాబి) ఛైర్మన్గా కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







