సముద్ర ఖని ‘బ్రో’ ఇంతటితో ఆగేదే లే.!
- July 27, 2023
తమిళ నటుడు కమ్ దర్శకుడు అయిన సముద్ర ఖని తెలుగులో తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమా తెలుగులో పురుడు పోసుకోవడానికి కారణం గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్.. అని ఆయన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలిపారు.
ఈ కథకున్న బలానికి తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా తెరకెక్కించాలని ఆశపడుతున్నా.. అని తన మనసులోని మాట చెప్పగానే కేవలం 10 నిముషాల్లోనే త్రివిక్రమ్ అంతా సెట్ చేసేశారట. పవన్ కళ్యాణ్ అయితే ఓకేనా.. అని పవన్ని ఈ సబ్జెక్ట్లోకి తీసుకొచ్చి, సాయి ధరమ్ తేజ్ని భాగం చేసి, ‘బ్రో’ని ఓ క్రేజీ ప్రాజెక్ట్గా తీర్చి దిద్దిన ఘనత ఆయనదే అని సముద్ర ఖని చెప్పారు.
టైమ్ సోల్తో నడిచే ఈ స్టోరీని ఇప్పటికే తమిళంలో సక్సెస్ చేసి, తెలుగులో రికార్డులు కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు సముద్ర ఖని. అయితే, ఇంతటితో ఈ కథ ఆగేదేలేదట. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 12 భాషల్లో ఈ స్టోరీని తెరకెక్కించాలని అనుకుంటున్నాడట సముద్రఖని. నెక్స్ట్ హిందీ రీమేక్పై ఫోకస్ పెట్టబోతున్నారనీ తెలుస్తోంది. చూడాలి మరి, సముద్ర ఖని అనుకున్నది సాధిస్తారో లేదో.!
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









