నాగార్జున - ధనుష్ కాంబో.! ఇదో బిగ్ మల్టీ స్టార్ కానుందా.?
- July 27, 2023
ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్లోకి తాజాగా నాగార్జున వచ్చి చేరారని తాజా సమాచారం. మల్టీ స్టారర్ సినిమాలకు టాలీవుడ్ సరికొత్త శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఇలా మల్టీ స్టారర్స్ కాన్సెప్ట్స్తో వచ్చిన సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సృష్టించడంతో పాటూ, ఫ్యాన్స్కి సరికొత్త ఉత్సాహాన్నిస్తున్నాయ్.
ఆ క్రమంలోనే మరిన్ని మల్టీ స్టారర్లు రూపు దిద్దుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కోవలోనే తమిళ స్టార్ హీరో ధనుష్, తెలుగు స్టార్ హీరో నాగార్జున కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోంది.
ముందుగా ఈ సినిమాని ధనుష్ హీరోగానే తెరకెక్కించాలనుకున్నారట. అయితే, నాగార్జున గెస్ట్ రోల్ చేయాలనుకున్నారట. ఆ తర్వాత గెస్ట్ రోల్ కాదు, ఫుల్ లెంగ్త్ పవర్ ఫుల్ రోల్గా మారిందట.
సో, ఈ ఇద్దర్నీ బ్యాలెన్స్ చేసేందుకు శేఖర్ కమ్ముల ఇంకాస్త ఎక్కువే కసరత్తులు చేయబోతున్నారట ఈ ప్రాజెక్ట్పై. అంతేకాదు, దీన్ని ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారట. హీరోయిన్గా రష్మిక మండన్నా పేరు పరిశీలిస్తున్నారనీ తెలుస్తోంది. చూస్తుంటే, ఇదో బిగ్ మల్టీ స్టారర్ కానుందనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









