నాగార్జున - ధనుష్ కాంబో.! ఇదో బిగ్ మల్టీ స్టార్ కానుందా.?
- July 27, 2023
ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్లోకి తాజాగా నాగార్జున వచ్చి చేరారని తాజా సమాచారం. మల్టీ స్టారర్ సినిమాలకు టాలీవుడ్ సరికొత్త శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఇలా మల్టీ స్టారర్స్ కాన్సెప్ట్స్తో వచ్చిన సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సృష్టించడంతో పాటూ, ఫ్యాన్స్కి సరికొత్త ఉత్సాహాన్నిస్తున్నాయ్.
ఆ క్రమంలోనే మరిన్ని మల్టీ స్టారర్లు రూపు దిద్దుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కోవలోనే తమిళ స్టార్ హీరో ధనుష్, తెలుగు స్టార్ హీరో నాగార్జున కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోంది.
ముందుగా ఈ సినిమాని ధనుష్ హీరోగానే తెరకెక్కించాలనుకున్నారట. అయితే, నాగార్జున గెస్ట్ రోల్ చేయాలనుకున్నారట. ఆ తర్వాత గెస్ట్ రోల్ కాదు, ఫుల్ లెంగ్త్ పవర్ ఫుల్ రోల్గా మారిందట.
సో, ఈ ఇద్దర్నీ బ్యాలెన్స్ చేసేందుకు శేఖర్ కమ్ముల ఇంకాస్త ఎక్కువే కసరత్తులు చేయబోతున్నారట ఈ ప్రాజెక్ట్పై. అంతేకాదు, దీన్ని ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారట. హీరోయిన్గా రష్మిక మండన్నా పేరు పరిశీలిస్తున్నారనీ తెలుస్తోంది. చూస్తుంటే, ఇదో బిగ్ మల్టీ స్టారర్ కానుందనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







