ఎడారిగా మారిన బహ్రెయిన్లోని ప్లేగ్రౌండ్లు..!
- July 28, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లోని చిల్డ్రన్స్ పార్కులు మరియు ఫుట్బాల్ మైదానాలు దాదాపు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజలు వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తమ ఇళ్లను విడిచి బయటకు రావడం లేదు. దీంతో ప్లే గ్రౌండ్ లు దాదాపు నిర్మానుషంగా మారాయి. ఈ వేసవిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్లేగ్రౌండ్ పరికరాలు వేడెక్కడంతో వాటితో ఆడేందుకు పిల్లలు ముందుకు రావడం లేదు. చాలా ప్లేగ్రౌండ్లు షేడ్లో ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాలు బహిరంగ ప్రదేశాలలో ఉన్నాయి. అయితే, సాయంత్రం సూర్యుడు ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, కొన్ని అత్యంత ప్రసిద్ధ ఇండోర్ ఎంటర్టైన్మెంట్ సెంటర్లు రద్దీగా ఉంటున్నాయి. బహ్రెయిన్లోని ఇండోర్ ప్లే ఏరియా ఫెయిర్గ్రౌండ్లు ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటాయి. పెర్ల్ మాథియాస్ అనే గృహిణి మాట్లాడుతూ.. తన పిల్లవాడు పార్క్లో ఆడటం మరియు స్లైడ్లలోకి వెళ్లడం ఆనందిస్తున్నప్పటికీ, వేడిలో అతనిని బయటికి పంపేందుకు బయపడుతున్నట్లు పేర్కొన్నారు. "ఇప్పుడు పాఠశాలలు మూసివేయబడ్డాయి. నేను సాధారణంగా అతనికి రోజంతా నా ఫోన్ ఇస్తాను. వారాంతాల్లో అతడిని మాల్స్ లోపల ఉన్న చకాజూలు లేదా మ్యాజిక్ ఐలాండ్ వంటి ప్రదేశాలకు తీసుకువెళతాము. " అని పేర్కొన్నారు. , "చాలా ప్లేగ్రౌండ్లు ఖాళీగా ఉన్నాయి.ఇప్పుడు తక్కువ మంది మాత్రమే ఆడుతున్నారు. శీతాకాలంలో ఫుట్బాల్ ఆడటానికి మేము ముందుగానే రిజర్వేషన్లు చేసుకొని చాలా లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఇప్పుడు ప్రజలు ఎయిర్ కండిషనింగ్లో ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడతారు. " భారతీయ జాతీయుడు మహ్మద్ డానిష్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









