రానా కొత్త డెసిషన్..! లెగసీని కంటిన్యూ చేయడానికే.!
- July 31, 2023
ప్రముఖ నిర్మాత రామా నాయుడుకి వారసుడిగా రానా దగ్గుబాటి నిర్మాణ రంగంలోనూ దూకుడు ప్రదర్శించాలనుకుంటున్నాడు కాబోలు. ఇప్పటికే విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు రానా.
సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ నటనలో తనదైన సత్తా చూపిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఈ మధ్య పెద్దగా సినిమాలు రావడం లేదు.
అయినా ఆ బ్యానర్ని తండ్రి సురేష్ బాబు ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. తాజాగా రానా కొత్త నిర్మాణ సంస్థని రూపొందించి అభిరుచి గల సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. స్పిరిట్ మీడియా అనే పేరుతో తాజాగా ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘మాయా బజార్’ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అలాగే, దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ కొత్త సినిమాని ఇదే బ్యానర్లో రానా రూపొందించబోతున్నారు. అలాగే మరిన్ని కొత్త ప్రాజెక్టులు తన కొత్త బ్యానర్లో రూపొందించాలనుకుంటున్నాడట రానా.
అన్నట్లు రానా హీరోగా రూపొందబోయే ‘హిరణ్యకశ్యప’ సినిమా కూడా ఇదే బ్యానర్లో రూపొందబోతోంది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









