రానా కొత్త డెసిషన్..! లెగసీని కంటిన్యూ చేయడానికే.!
- July 31, 2023
ప్రముఖ నిర్మాత రామా నాయుడుకి వారసుడిగా రానా దగ్గుబాటి నిర్మాణ రంగంలోనూ దూకుడు ప్రదర్శించాలనుకుంటున్నాడు కాబోలు. ఇప్పటికే విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు రానా.
సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ నటనలో తనదైన సత్తా చూపిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఈ మధ్య పెద్దగా సినిమాలు రావడం లేదు.
అయినా ఆ బ్యానర్ని తండ్రి సురేష్ బాబు ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. తాజాగా రానా కొత్త నిర్మాణ సంస్థని రూపొందించి అభిరుచి గల సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. స్పిరిట్ మీడియా అనే పేరుతో తాజాగా ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘మాయా బజార్’ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అలాగే, దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ కొత్త సినిమాని ఇదే బ్యానర్లో రానా రూపొందించబోతున్నారు. అలాగే మరిన్ని కొత్త ప్రాజెక్టులు తన కొత్త బ్యానర్లో రూపొందించాలనుకుంటున్నాడట రానా.
అన్నట్లు రానా హీరోగా రూపొందబోయే ‘హిరణ్యకశ్యప’ సినిమా కూడా ఇదే బ్యానర్లో రూపొందబోతోంది.
తాజా వార్తలు
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!









