రానా కొత్త డెసిషన్..! లెగసీని కంటిన్యూ చేయడానికే.!
- July 31, 2023
ప్రముఖ నిర్మాత రామా నాయుడుకి వారసుడిగా రానా దగ్గుబాటి నిర్మాణ రంగంలోనూ దూకుడు ప్రదర్శించాలనుకుంటున్నాడు కాబోలు. ఇప్పటికే విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు రానా.
సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ నటనలో తనదైన సత్తా చూపిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఈ మధ్య పెద్దగా సినిమాలు రావడం లేదు.
అయినా ఆ బ్యానర్ని తండ్రి సురేష్ బాబు ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. తాజాగా రానా కొత్త నిర్మాణ సంస్థని రూపొందించి అభిరుచి గల సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. స్పిరిట్ మీడియా అనే పేరుతో తాజాగా ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘మాయా బజార్’ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అలాగే, దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ కొత్త సినిమాని ఇదే బ్యానర్లో రానా రూపొందించబోతున్నారు. అలాగే మరిన్ని కొత్త ప్రాజెక్టులు తన కొత్త బ్యానర్లో రూపొందించాలనుకుంటున్నాడట రానా.
అన్నట్లు రానా హీరోగా రూపొందబోయే ‘హిరణ్యకశ్యప’ సినిమా కూడా ఇదే బ్యానర్లో రూపొందబోతోంది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







