20 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- August 03, 2023
యూఏఈ: గత రెండు సంవత్సరాలుగా మహ్జూజ్ డ్రాలో పాల్గొంటూ రాఫెల్స్లో 25,000 దిర్హామ్లకు పైగా ఖర్చు చేసిన తర్వాత దుబాయ్లోని ఒక భారతీయ ప్రవాసుడు చివరకు 20 మిలియన్ దిర్హామ్ల జాక్పాట్ను కొట్టాడు. ఆర్కిటెక్చరల్ సంస్థలో పని చేస్తున్న 47 ఏళ్ల సచిన్ 2022లో మహ్జూజ్ డ్రా ప్రారంభం నుండి పాల్గొంటున్నాడు. "ఈ విజయం నాకు పూర్తిగా షాక్ ఇచ్చింది. ఈ వార్త నా జీవితాన్ని మార్చేసింది. మహ్జూజ్ అధికారుల నుండి నాకు కాల్ వచ్చినప్పటి నుండి నేను నిద్రపోలేకపోతున్నాను" అని ముంబైకి చెందిన సచిన్ తెలిపారు. "నేను గెలిచిన డబ్బుతో, నా పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని ఆశిస్తున్నాను. పెట్టుబడి మరియు ఖర్చుపై నేను ఇంకా నిర్ణయించుకోలేదు." అని పేర్కొన్నారు. పిల్లిని దత్తత తీసుకున్న తర్వాత అదృష్టం వచ్చిందన్నారు. శనివారం ఉదయం పిల్లిని దత్తత తీసుకోగా.. అదే రోజు సాయంత్రం జాక్పాట్ కొట్టినట్టు సమాచారం అందిందని సచిన్ తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









