20 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- August 03, 2023
యూఏఈ: గత రెండు సంవత్సరాలుగా మహ్జూజ్ డ్రాలో పాల్గొంటూ రాఫెల్స్లో 25,000 దిర్హామ్లకు పైగా ఖర్చు చేసిన తర్వాత దుబాయ్లోని ఒక భారతీయ ప్రవాసుడు చివరకు 20 మిలియన్ దిర్హామ్ల జాక్పాట్ను కొట్టాడు. ఆర్కిటెక్చరల్ సంస్థలో పని చేస్తున్న 47 ఏళ్ల సచిన్ 2022లో మహ్జూజ్ డ్రా ప్రారంభం నుండి పాల్గొంటున్నాడు. "ఈ విజయం నాకు పూర్తిగా షాక్ ఇచ్చింది. ఈ వార్త నా జీవితాన్ని మార్చేసింది. మహ్జూజ్ అధికారుల నుండి నాకు కాల్ వచ్చినప్పటి నుండి నేను నిద్రపోలేకపోతున్నాను" అని ముంబైకి చెందిన సచిన్ తెలిపారు. "నేను గెలిచిన డబ్బుతో, నా పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని ఆశిస్తున్నాను. పెట్టుబడి మరియు ఖర్చుపై నేను ఇంకా నిర్ణయించుకోలేదు." అని పేర్కొన్నారు. పిల్లిని దత్తత తీసుకున్న తర్వాత అదృష్టం వచ్చిందన్నారు. శనివారం ఉదయం పిల్లిని దత్తత తీసుకోగా.. అదే రోజు సాయంత్రం జాక్పాట్ కొట్టినట్టు సమాచారం అందిందని సచిన్ తెలిపారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







