20 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- August 03, 2023
యూఏఈ: గత రెండు సంవత్సరాలుగా మహ్జూజ్ డ్రాలో పాల్గొంటూ రాఫెల్స్లో 25,000 దిర్హామ్లకు పైగా ఖర్చు చేసిన తర్వాత దుబాయ్లోని ఒక భారతీయ ప్రవాసుడు చివరకు 20 మిలియన్ దిర్హామ్ల జాక్పాట్ను కొట్టాడు. ఆర్కిటెక్చరల్ సంస్థలో పని చేస్తున్న 47 ఏళ్ల సచిన్ 2022లో మహ్జూజ్ డ్రా ప్రారంభం నుండి పాల్గొంటున్నాడు. "ఈ విజయం నాకు పూర్తిగా షాక్ ఇచ్చింది. ఈ వార్త నా జీవితాన్ని మార్చేసింది. మహ్జూజ్ అధికారుల నుండి నాకు కాల్ వచ్చినప్పటి నుండి నేను నిద్రపోలేకపోతున్నాను" అని ముంబైకి చెందిన సచిన్ తెలిపారు. "నేను గెలిచిన డబ్బుతో, నా పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని ఆశిస్తున్నాను. పెట్టుబడి మరియు ఖర్చుపై నేను ఇంకా నిర్ణయించుకోలేదు." అని పేర్కొన్నారు. పిల్లిని దత్తత తీసుకున్న తర్వాత అదృష్టం వచ్చిందన్నారు. శనివారం ఉదయం పిల్లిని దత్తత తీసుకోగా.. అదే రోజు సాయంత్రం జాక్పాట్ కొట్టినట్టు సమాచారం అందిందని సచిన్ తెలిపారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









