పవిత్ర కాబా వార్షిక ఉత్సవంలో మక్కా డిప్యూటీ ఎమిర్
- August 03, 2023
మక్కా: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ తరపున మక్కా డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ బదర్ బిన్ సుల్తాన్ నాయకత్వం వహించారు. బుధవారం ఉదయం పవిత్ర కాబా వార్షిక ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రాండ్ మసీదుకు చేరుకున్న తర్వాత కాబా గోడలను లోపలి నుండి గులాబీ, కస్తూరి పరిమళాలలో ముంచిన తెల్లటి క్లాత్ ముక్కలతో తుడిచివేయడం ద్వారా కాబాను శుభ్రం చేసారు. అంతకుముందు డిప్యూటీ ఎమిర్ను రెండు పవిత్ర మసీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ హెడ్ షేక్ అబ్దుల్ రెహ్మాన్ అల్-సుదైస్ స్వాగతించారు. క్లీనింగ్ వేడుక తర్వాత డిప్యూటీ ఎమిర్ తవాఫ్ (కాబా చుట్టూ ప్రదక్షిణలు) చేసి, ఆపై ప్రార్థనలు చేశారు. సౌదీ చక్రవర్తి లేదా అతని ప్రతినిధి పవిత్ర కాబా వార్షిక ఉత్సవంలో పాల్గొనడం ఆచారంగా ఉంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









