రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది: కువైట్
- August 03, 2023
కువైట్: ప్రాణాలను కాపాడేందుకు రక్తదాన సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జీవితాలను రక్షించడానికి, ఆరోగ్య సేవల అభివృద్ధికి రక్తదాన సంస్కృతిని ప్రోత్సహించాలని విదేశీ ఆరోగ్య సేవల వ్యవహారాల MoH అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ యాకూబ్ అల్-తమర్ చెప్పారు. రక్త మార్పిడికి సంబంధించిన సేవలకు మంత్రిత్వ శాఖ ఎల్లప్పుడూ మద్దతునిస్తుందన్నారు. ఏడాది పొడవునా రక్తదానం మరియు ప్రచారాలను నిర్వహించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి కృషి చేస్తుంది. ఏటా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రక్తదానంపై అవగాహన కల్పిస్తుందన్నారు. అన్ని రోజులలో రక్త దాతలు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రక్తదానాల సంఖ్య 60 శాతం పెరిగిందన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







