నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..
- August 03, 2023
అమరావతి: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో రెగ్యులర్ సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చారు. 3 వేల 295 పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేశారు. వీటిని ఏపీపీఎస్సీ(APPSC) ద్వారా భర్తీ చేయనున్నారు. 2వేల 635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఉండగా.. వీటిలో లెక్చరర్లు, ప్రొఫెసర్ల కొలువులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య ఉండాలంటే పూర్తిస్థాయిలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం జగన్ చెప్పారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!