తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం

- August 03, 2023 , by Maagulf
తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం

తిరుమల: తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు.టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. స్వామివారిని బుధవారం 69,365 మంది యాత్రికులు దర్శించుకోగా 26,006 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.05 కోట్లు వచ్చిందని వివరించారు. ప్రతి నెల నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఆగస్టు 4న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగే కార్యక్రమానికి యాత్రికులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకు యాత్రికులు 0877-2263261 అనే నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com