డెంగ్యూ ఫీవర్తో వచ్చిన నీరసాన్ని తగ్గించుకోవాలంటే.!
- August 04, 2023సీజనల్ మార్పులో భాగంగా డెంగ్యూ జ్వరాలు జనాల్ని అతలాకుతలం చేస్తున్నాయ్. దోమల కారణంగా వ్యాప్తి చెందే డెంగ్యూ జ్వరం కారణంగా ప్లేట్లెట్స్ దారుణంగా పడిపోతాయ్. దాంతో విపరీతమైన నీరసం, హై టెంపరేచర్తో పాటూ, కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితి కూడా తలెత్తవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుని చికిత్స ఖచ్చితంగా అవసరం. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూనే కొన్ని రకాల ఫుడ్ ఛేంజెస్ చేసుకోవడం ద్వారా డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు.
డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, పండ్లలో బొప్పాయిని ప్రధానంగా తినాలి. బొప్పాయి పండుతో పాటూ, ఆకుల రసాన్ని కూడా తాగుతుండాలి. పైనాపిల్ పండు కూడా ఈ సమయంలో మంచి శక్తినిస్తుంది. ప్లేట్లెట్స్ పెరగాలంటే, విటమిన్ ఏ,కే,బీ 12, సీ ఎక్కువగా వుండే పండ్లు, కూరగాయలను తినాలి. నారింజ, యాపిల్, బత్తాయి పండ్లలో ఈ విటమిన్లు అధికంగా లభిస్తాయ్.
క్యారెట్, బీట్ రూట్తో పాటూ, గుమ్మడికాయ, చిలగడ దుంపల్ని కూడా తింటే మంచిది. ఉసిరి కాయతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుందని చెబుతున్నారు.
డెంగ్యూ జ్వరాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయరాదు. నిర్దేశిత సమయంలో వైద్యుని సలహా తీసుకుని, సహజ సిద్ధమైన ఆహారాన్ని టైమ్ టు టైమ్ తీసుకోవడం ద్వారా డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునే అవకాశముంటుది.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్