ఇండియన్ స్కూల్‌లో అప్పీల్ సిస్టమ్ ప్రారంభం

- August 07, 2023 , by Maagulf
ఇండియన్ స్కూల్‌లో అప్పీల్ సిస్టమ్ ప్రారంభం

మస్కట్: ఒమన్‌లోని ఇండియన్ స్కూల్ మస్కట్ (ఐఎస్‌ఎం)లో టర్మ్ పరీక్షల సమయంలో విద్యార్థులు తమ మార్కులను సమీక్షించడానికి పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఇండియన్ స్కూల్స్ ఒమన్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ డాక్టర్ శివకుమార్ మాణికం మాట్లాడుతూ.. ఇది ISM ప్రవేశపెట్టిన కొత్త వ్యవస్థ అన్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో ఆశించిన విజయం, లక్ష్యాలు నెరవేరినట్లయితే, తాము దానిని మిగతా వాటికి విస్తరిస్తామని పేర్కొన్నారు. ISM ఇటీవల జారీ చేసిన ఒక సర్క్యులర్ ప్రకారం..విద్యార్థులు 1-12 తరగతి నుండి టర్మ్ పరీక్షలలో సాధించిన గ్రేడ్‌లకు వ్యతిరేకంగా ఒక్కో సబ్జెక్టుకు OMR3 రుసుముతో అధికారికంగా అప్పీల్ చేసే హక్కు ఉంటుంది. విద్యార్థులు తమ మార్కులపై అసంతృప్తిగా ఉంటే వారికి సహాయం చేయడమే లక్ష్యంగా  పైలట్ ప్రాజెక్ట్‌గా  ISM దీన్ని అంతర్గతంగా ప్రవేశపెట్టిందని మాణికం తెలిపారు. ఈ సదుపాయం అంతర్గత అసెస్‌మెంట్‌లకు (క్లాస్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్, ప్రాక్టికల్, నోట్‌బుక్, పోర్ట్‌ఫోలియో మొదలైనవి),  CBSE నిర్వహించే పరీక్షలకు వర్తించదని ఆయన స్పష్టం చేశారు. అప్పీల్ ఫారమ్‌ను అన్ని పని దినాలలో ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల మధ్య పాఠశాల అడ్మిషన్ కార్యాలయం నుండి తీసుకోవచ్చని, పాఠశాల మార్కులను విడుదల చేసిన ఐదు పనిదినాల్లోపు ఫీజు చెల్లింపు కాపీతో పాటు దరఖాస్తును పాఠశాల ప్రవేశ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com