ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం

- August 07, 2023 , by Maagulf
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం

న్యూ ఢిల్లీ: ఢిల్లీ లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డు పైన ఉన్న ఎండోస్కోపీ గదిలో మంటలు చెలరేగాయి. పాత ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) రెండవ అంతస్తులోని ఎండోస్కోపీ గదిలో మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ అలముకుంది.

అగ్నిప్రమాదం జరగడం తో రోగులను సిబ్బంది రక్షించడం తో ప్రాణ పాయం తప్పింది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com