యూఏఈ లో వీసాల గడువు ముగిస్తే.. రోజుకు 50 Dhs జరిమానా
- August 08, 2023
యూఏఈ: యూఏఈలో రెసిడెన్సీ, విజిట్ వీసా గడువు ముగిసిన తర్వాత రోజుకు 50 Dhs జరిమానా విధించనున్నట్లు యూఏఈ డిజిటల్ ప్రభుత్వం వెల్లడించింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ నేషనాలిటీ, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ ప్రకారం.. గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత ప్రతి రోజు 50 Dhs జరిమానా ఉంటుందని అధికారులు తెలిపారు. దేశంలో నివసిస్తున్న విదేశీయులు, పర్యాటకులు వీసా జారీ, పొడిగింపు లేదా రద్దు సేవ కోసం చెల్లించాల్సిన రుసుము తెలుసుకునేందుకు.. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫారినర్స్ అఫైర్స్ దుబాయ్ వెబ్సైట్లను, సేవా కేంద్రాలను సందర్శించాలని డిజిటల్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. అదే విధంగా ప్రవేశ అనుమతి, వీసా సేవ కోసం అభ్యర్థనను అధికార వెబ్సైట్, స్మార్ట్ అప్లికేషన్, "దుబాయ్ నౌ" వెబ్సైట్, టైపింగ్ సెంటర్ల ద్వారా సమర్పించవచ్చని అధికారులు సూచించారు. వీసా దరఖాస్తు కోసం ఎలక్ట్రానిక్ ఛానెల్లు ఉన్నాయని, వాటి ద్వారా ఎంట్రీ పర్మిట్ లేదా నివాస అనుమతి కోసం అభ్యర్థనను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఆ అప్లికేషన్లు Google, Apple స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. వీసా లేదా ఎంట్రీ పర్మిట్ పొందడం కోసం దరఖాస్తును నేరుగా, అథారిటీతో నమోదు చేసుకున్న టైపింగ్ కార్యాలయాలు లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ దుబాయ్ ద్వారా గుర్తింపు పొందిన కార్యాలయాల ద్వారా సమర్పించవచ్చని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







