జూలైలో రికార్డు సృష్టించిన కువైట్ విమానాశ్రయం
- August 09, 2023
కువైట్: జూలైలో మొత్తం 1,447,790 మంది ప్రయాణికులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ప్రయాణించి వెళ్లారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) మంగళవారం తెలిపింది. DGCA తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఇమాద్ అల్-జలావి మాట్లాడుతూ.. విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య 16 శాతం , విమానాల సంఖ్య 23 శాతం పెరిగాయని తెలిపారు. 2022 ఇదే కాలంతో పోల్చితే జూలైలో ఎయిర్ షిప్పింగ్ మూడు శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. జూలైలో వచ్చిన వారి సంఖ్య 640,458కి చేరుకోగా, దేశం విడిచి వెళ్లిన ప్రయాణికుల సంఖ్య 806,232గా ఉందన్నారు. రవాణా ప్రయాణీకుల సంఖ్య 166,465కి చేరుకుందని, ఇది 2022 అదే సమయంతో పోలిస్తే 75 శాతం పెరిగిందన్నారు. జూలైలో కువైట్ విమానాశ్రయానికి 12,468 ప్యాసింజర్ విమానాలు వచ్చాయని తెలిపారు. ఎయిర్ షిప్పింగ్లో, 12.7 మిలియన్ కిలోల దిగుమతి చేసుకున్న వస్తువులతో సహా 16.1 మిలియన్ కిలోలు రవాణా చేయబడినట్లు ఆయన వెల్లడించారు. పైన పేర్కొన్న కాలంలో దుబాయ్, కైరో, ఇస్తాంబుల్, దోహా మరియు జెద్దా చాలా డిమాండ్ ఉన్న గమ్యస్థానాలు అని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







