కరీంనగర్లో NIA సోదాలు
- August 10, 2023
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో ఎన్ఐఏ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి. అనుమానితుని కోసం ఎన్ఐఏ అధికారులు నగరంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం.. ఏఆర్ పోలీసుల బందోబస్తు మధ్య సోదాలు చేపట్టింది.
కరీంనగర్ హుస్సేనీపురకు చెందిన తబరేజ్ కు గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉపాధి పొందతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్ఐఏ అధికారుల బృందం అతని ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కరీంనగర్ కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెల్లవారు జామునే కరీంనగర్ చేరుకున్న టీమ్ ఎన్ఐఏ డీఎస్పీ రాజేష్ ఆధ్వర్యంలో.. అనుమానిత వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. అధికారులు తనిఖీలు చేస్తున్న ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







