కరీంనగర్లో NIA సోదాలు
- August 10, 2023కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో ఎన్ఐఏ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి. అనుమానితుని కోసం ఎన్ఐఏ అధికారులు నగరంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం.. ఏఆర్ పోలీసుల బందోబస్తు మధ్య సోదాలు చేపట్టింది.
కరీంనగర్ హుస్సేనీపురకు చెందిన తబరేజ్ కు గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉపాధి పొందతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్ఐఏ అధికారుల బృందం అతని ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కరీంనగర్ కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెల్లవారు జామునే కరీంనగర్ చేరుకున్న టీమ్ ఎన్ఐఏ డీఎస్పీ రాజేష్ ఆధ్వర్యంలో.. అనుమానిత వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. అధికారులు తనిఖీలు చేస్తున్న ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..