పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన అధ్యక్షుడు అల్వీ
- August 10, 2023
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సిఫారసు మేరకు పార్లమెంటును ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీ బుధవారం రాత్రి రద్దు చేశారు. పార్లమెంటు పదవీ కాలం ముగియడానికి మూడు రోజుల ముందుగానే షరీఫ్ ఈ సిఫారసు చేశారు. తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నడుమ పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. పాకిస్థాన్ పార్లమెంటు పదవీ కాలం ఈ నెల 12తో ముగుస్తుంది. అనంతరం ఏర్పడే ఆపద్ధర్మ ప్రభుత్వం 90 రోజుల్లోగా ఎన్నికలను నిర్వహిస్తుంది. షరీఫ్ బుధవారం పార్లమెంటులో మాట్లాడుతూ, తాను పార్లమెంటు రద్దుకు సిఫారసు చేస్తానని తెలిపారు. ఆపద్ధర్మ ప్రధాన మంత్రిని నియమించేందుకు అధికార, ప్రతిపక్షాలతో గురువారం నుంచి చర్చలు ప్రారంభిస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







