టిటిడి ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

- August 10, 2023 , by Maagulf
టిటిడి ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

తిరుమల: టిడిపి నూతన చైర్మన్‌గా ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి. బాధత్యలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సామాన్య భక్తుడే నా మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ధనవంతులుకు ఉడిగం చెయ్యడానికో….వారికి ప్రాధాన్యత ఇవ్వడానికో ఈ పదవి చెప్పట్టలేదని వెల్లడించారు. హింధు ధార్మికతను పెంపోందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు.

దేవుడిని ఎక్కువ సమయం దర్శనం చేసుకోవడం కాదు…స్వామి భక్తుడిని అనుగ్రహించే క్షణకాల దర్శనం లభిస్తే చాలు అన్నారు. టిటిడి చైర్మన్ గా పెద్దలకు విజ్ఞప్తి చేస్తూన్నా….ఎక్కువ సమయం స్వామివారిని దర్శించుకోవాలన్నా కోరిక సమంజసం కాదని తెలిపారు. కోట్లాదిమంది ఆశించే టిటిడి చైర్మన్ పదవిని ఆశిస్తూ వుంటే….సామాన్య భక్తుడినైన నన్ను స్వామివారు అనుగ్రహించారని గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాలు పాలకమండలి సభ్యుడిగా వున్నా….నాలుగు సార్లు కూడా విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్లలేదు…. సామాన్య భక్తుడిలాగే స్వామివారిని మహలఘు విధానంలో అనేక సార్లు దర్శించుకున్నానన్నారు టిడిపి చైర్మన్ కరుణాకర్ రెడ్డి.

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com