బిఆర్ఎస్ కు పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు: కిషన్ రెడ్డి
- August 12, 2023
హైదరాబాద్: కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సిఎం కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ అబద్దాలకు ప్రతిరూపమని విమర్శించారు. పాత హామీలనే కొత్తగా చెబుతూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయం రాజ్యమేలుతుందని దుయ్యబట్టారు. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోనూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రగతి భవన్ ను నాలుగు నెలల్లో, సచివాలయాన్ని ఎనిమిది నెలల్లో నిర్మించుకున్న కెసిఆర్.. పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి మాత్రం ఏళ్ల సమయం తీసుకుంటున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ కు పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని 2017 లో చెప్పిన కెసిఆర్ ఇప్పుడు మరోసారి ఎన్నికలకు ఎలా వెళతారని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









