యెమెన్ తీరంలో సఫర్ ట్యాంకర్ ఖాళీ. స్వాగతించిన సౌదీ
- August 12, 2023
రియాద్: యెమెన్లోని ఎర్ర సముద్ర తీరంలో అవసాన దశలో ఉన్న ఎఫ్ఎస్ఓ సఫర్ సూపర్ ట్యాంకర్ నుండి ముడి చమురు తొలగింపును పూర్తి చేస్తున్నట్లు ఐరాస ప్రకటనను సౌదీ అరేబియా స్వాగతించింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ను, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి యూఎన్ బృందం చేస్తున్న ప్రయత్నాలను సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. అలాగే మిషన్ కోసం విరాళం ఇచ్చిన దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు, యెమెన్ ఎర్ర సముద్ర తీరంలో FSO సేఫర్ సూపర్ ట్యాంకర్ నుండి చమురు బదిలీని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. సేఫర్ చాలా సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయింది. ఇటీవల అది పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.ఇది పర్యావరణ విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జూలై 25న FSO సేఫర్లోని చమురును ఖాళీ చేసే ప్రక్రియను యూఎన్ చేపట్టింది. మొత్తం 1.14 మిలియన్ బ్యారెళ్ల చమురును సురక్షితంగా తరలించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









