యెమెన్ తీరంలో సఫర్ ట్యాంకర్ ఖాళీ. స్వాగతించిన సౌదీ
- August 12, 2023
రియాద్: యెమెన్లోని ఎర్ర సముద్ర తీరంలో అవసాన దశలో ఉన్న ఎఫ్ఎస్ఓ సఫర్ సూపర్ ట్యాంకర్ నుండి ముడి చమురు తొలగింపును పూర్తి చేస్తున్నట్లు ఐరాస ప్రకటనను సౌదీ అరేబియా స్వాగతించింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ను, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి యూఎన్ బృందం చేస్తున్న ప్రయత్నాలను సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. అలాగే మిషన్ కోసం విరాళం ఇచ్చిన దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు, యెమెన్ ఎర్ర సముద్ర తీరంలో FSO సేఫర్ సూపర్ ట్యాంకర్ నుండి చమురు బదిలీని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. సేఫర్ చాలా సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయింది. ఇటీవల అది పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.ఇది పర్యావరణ విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జూలై 25న FSO సేఫర్లోని చమురును ఖాళీ చేసే ప్రక్రియను యూఎన్ చేపట్టింది. మొత్తం 1.14 మిలియన్ బ్యారెళ్ల చమురును సురక్షితంగా తరలించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







