యెమెన్ తీరంలో సఫర్ ట్యాంకర్ ఖాళీ. స్వాగతించిన సౌదీ
- August 12, 2023
రియాద్: యెమెన్లోని ఎర్ర సముద్ర తీరంలో అవసాన దశలో ఉన్న ఎఫ్ఎస్ఓ సఫర్ సూపర్ ట్యాంకర్ నుండి ముడి చమురు తొలగింపును పూర్తి చేస్తున్నట్లు ఐరాస ప్రకటనను సౌదీ అరేబియా స్వాగతించింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ను, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి యూఎన్ బృందం చేస్తున్న ప్రయత్నాలను సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. అలాగే మిషన్ కోసం విరాళం ఇచ్చిన దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు, యెమెన్ ఎర్ర సముద్ర తీరంలో FSO సేఫర్ సూపర్ ట్యాంకర్ నుండి చమురు బదిలీని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. సేఫర్ చాలా సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయింది. ఇటీవల అది పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.ఇది పర్యావరణ విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జూలై 25న FSO సేఫర్లోని చమురును ఖాళీ చేసే ప్రక్రియను యూఎన్ చేపట్టింది. మొత్తం 1.14 మిలియన్ బ్యారెళ్ల చమురును సురక్షితంగా తరలించారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







