యెమెన్ తీరంలో సఫర్ ట్యాంకర్ ఖాళీ. స్వాగతించిన సౌదీ
- August 12, 2023
రియాద్: యెమెన్లోని ఎర్ర సముద్ర తీరంలో అవసాన దశలో ఉన్న ఎఫ్ఎస్ఓ సఫర్ సూపర్ ట్యాంకర్ నుండి ముడి చమురు తొలగింపును పూర్తి చేస్తున్నట్లు ఐరాస ప్రకటనను సౌదీ అరేబియా స్వాగతించింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ను, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి యూఎన్ బృందం చేస్తున్న ప్రయత్నాలను సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. అలాగే మిషన్ కోసం విరాళం ఇచ్చిన దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు, యెమెన్ ఎర్ర సముద్ర తీరంలో FSO సేఫర్ సూపర్ ట్యాంకర్ నుండి చమురు బదిలీని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. సేఫర్ చాలా సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయింది. ఇటీవల అది పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.ఇది పర్యావరణ విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జూలై 25న FSO సేఫర్లోని చమురును ఖాళీ చేసే ప్రక్రియను యూఎన్ చేపట్టింది. మొత్తం 1.14 మిలియన్ బ్యారెళ్ల చమురును సురక్షితంగా తరలించారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









