బహ్రెయిన్ లో ఘనంగా అంతర్జాతీయ యువజన దినోత్సవం
- August 12, 2023
బహ్రెయిన్: అంతర్జాతీయ యువజన దినోత్సవం 2023 సందర్భంగా "యువతకు గ్రీన్ స్కిల్స్: టువర్డ్స్ ఎ సస్టైనబుల్ వరల్డ్" అనే థీమ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో బహ్రెయిన్ చేతులు కలిపి పాల్గొంది. హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా( HM రాజు యొక్క మానవతావాద వర్క్ అండ్ యువజన వ్యవహారాల ప్రతినిధి) యువ నాయకులను పెంపొందించడం కోసం రాజ్యం వ్యూహాత్మక దృష్టిని ప్రకటించారు. పర్యావరణాన్ని పెంపొందించడంలో రాజ్యం నిబద్ధతను స్పష్టం చేశారు. యువతకు సాధికారత కల్పించడానికి మరియు భవిష్యత్తులో నాయకులుగా ఉండటానికి వారికి అన్ని అవకాశాలను అందించడానికి రాజ్యం బాగా ఆలోచించిన వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించిందని షేక్ నాసర్ వివరించారు. "హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో.. ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అందించిన మద్దతుకు ధన్యవాదాలు. రాజ్యం యువత తమ సామర్థ్యాలను ప్రదర్శించడానికి సరైన పరిస్థితులను అందించింది. వారిలో నాయకత్వ విలువలను పెంపొందించారు.”అని షేక్ నాసర్ అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (SDGలు) సాధించే లక్ష్యంతో యువత తమ జాతీయ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (BOC) ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా రాజ్యంలో యువత పురోగతిని ప్రశంసించారు. బహ్రెయిన్ యువత వివిధ రంగాలలో గ్లోబల్ మోడల్గా మారారని పేర్కొన్నారు. ప్రపంచ పోటీతత్వంలో దూసుకుపోతున్నారని కొనియాడారు. యువజన వ్యవహారాల మంత్రి రావన్ బింట్ నజీబ్ తౌఫీకి మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో యువత ఆచరణాత్మకంగా అభివృద్ధి చెందుతున్నారని, రాజ్యం తన విధానాన్ని విసృతం చేయనుందని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ద్వారా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో యువత ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు.
తాజా వార్తలు
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!









