కువైట్‌లో ఘనంగా భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు

- August 16, 2023 , by Maagulf
కువైట్‌లో ఘనంగా భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు

కువైట్: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు కువైట్ లో ఘనంగా నిర్వహించారు. ఇండియన్ అంబాసిడర్ హెచ్‌ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు.  తన ప్రసంగంలో భారతదేశం-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు కువైట్‌లోని భారతీయ సమాజంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు కువైట్ నాయకత్వానికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా సహాయం కోరే భారతీయ పౌరులందరికీ రాయబార కార్యాలయం తెరిచి ఉంటుందని స్పష్టం చేశారు.     

కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి శుభాకాంక్షలు తెలియజేసారు. భారతదేశ ప్రజలు మరింత పురోగతి చెందాలని ఆకాంక్షించారు. హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా కూడా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com