కువైట్లో ఘనంగా భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు
- August 16, 2023
కువైట్: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు కువైట్ లో ఘనంగా నిర్వహించారు. ఇండియన్ అంబాసిడర్ హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. తన ప్రసంగంలో భారతదేశం-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు కువైట్లోని భారతీయ సమాజంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు కువైట్ నాయకత్వానికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా సహాయం కోరే భారతీయ పౌరులందరికీ రాయబార కార్యాలయం తెరిచి ఉంటుందని స్పష్టం చేశారు.
కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి శుభాకాంక్షలు తెలియజేసారు. భారతదేశ ప్రజలు మరింత పురోగతి చెందాలని ఆకాంక్షించారు. హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా కూడా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







