‘ఖుషి’కి ఆ పబ్లిసిటీ సరిపోతుందా.?
- August 16, 2023
సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ ఈవెంట్ అందర్నీ ‘ఖుషి’ సినిమా వైపు అటెన్షన్ పెరిగేలా చేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయ్. కాగా, తాజా ఈవెంట్లో భాగంగా విజయ్ దేవరకొండ, సమంత గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయ్.
సమంత మయోసైటిస్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ అనారోగ్య సమస్య కారణంగానే ఆమె తాత్కాలికంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ఎక్కువగా లైటింగ్ని సమంత తట్టుకోలేదనీ, కళ్లు మండడం, విపరీతమైన తలనొప్పి రావడం.. వంటి సమస్యలు వచ్చి సమంత చాలా ఇబ్బంది పడుతుందని ఆమె అనారోగ్యం గురించి విజయ్ దేవరకొండ చెప్పాడు.
ఈ వ్యాఖ్యలు సమంత ఆరోగ్యంపై కొంత అనుమానం కలిగేలా చేస్తున్నాయ్. ఆ సంగతి అటుంచితే, ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలకు కూడా సమంత అనారోగ్య సమస్యే పబ్లిసిటీ ఎలిమెంట్ అయ్యింది. అయితే, ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టాయ్. సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. మరి, ఇప్పుడు కూడా ‘ఖుషి’ టీమ్ అదే చేస్తుందే.! రిజల్ట్ ఎలా వుండబోతోందో.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







