‘ఖుషి’కి ఆ పబ్లిసిటీ సరిపోతుందా.?
- August 16, 2023
సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ ఈవెంట్ అందర్నీ ‘ఖుషి’ సినిమా వైపు అటెన్షన్ పెరిగేలా చేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయ్. కాగా, తాజా ఈవెంట్లో భాగంగా విజయ్ దేవరకొండ, సమంత గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయ్.
సమంత మయోసైటిస్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ అనారోగ్య సమస్య కారణంగానే ఆమె తాత్కాలికంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ఎక్కువగా లైటింగ్ని సమంత తట్టుకోలేదనీ, కళ్లు మండడం, విపరీతమైన తలనొప్పి రావడం.. వంటి సమస్యలు వచ్చి సమంత చాలా ఇబ్బంది పడుతుందని ఆమె అనారోగ్యం గురించి విజయ్ దేవరకొండ చెప్పాడు.
ఈ వ్యాఖ్యలు సమంత ఆరోగ్యంపై కొంత అనుమానం కలిగేలా చేస్తున్నాయ్. ఆ సంగతి అటుంచితే, ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలకు కూడా సమంత అనారోగ్య సమస్యే పబ్లిసిటీ ఎలిమెంట్ అయ్యింది. అయితే, ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టాయ్. సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. మరి, ఇప్పుడు కూడా ‘ఖుషి’ టీమ్ అదే చేస్తుందే.! రిజల్ట్ ఎలా వుండబోతోందో.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









