గంధపు చెక్కల దొంగ వీరప్పన్ అట్టహాసంపై త్వరలో పుస్తకం!
- May 17, 2016
శంకర్ బిదిరి వెల్లడి బెంగళూరు : గంధపు చెక్కల దొంగ వీరప్పన్ అట్టహాసంపై త్వరలో పుస్తకాన్ని వెలువరించనున్నట్లు విశ్రాంత పోలీసు ప్రధానాధికారి శంకర్ బిదిరి వెల్లడించారు. మరో మూడు నెలల్లోగా పుస్తకం చదువరులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఆయన మంగళవారం బెంగళూరులో ఓ ప్రైవేట్ ఛానల్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వీరప్పన్కు సంబంధించి ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలిసిన సమాచారం కేవలం 20 శాతమేనని- తాను రచించనున్న పుస్తకంలో పూర్తి సమాచారం ఉంటుందన్నారు. వీరప్పన్ కోసం వేటలో పాల్గొన్న పోలీసు అధికారుల అనుభవాలు, వైఫల్యాల్ని కూడా అందులో పొందుపరుస్తానని చెప్పారు. ఆయన ఆటకట్టించేందుకు అప్పట్లో ఏర్పాటైన ప్రత్యేక పోలీసు దళానికి బిదిరి కొంతకాలం నేతృత్వం వహించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







