జెబెల్ అలీ గురుద్వారాలో పవిత్ర ఖురాన్ పఠనం!
- June 24, 2015
"దయచేసి రమదాన్ దినాలలో లoగరు (ప్రసాదం) పార్సిల్ ను అడగవద్దు" - అని సూచించే ఇంగ్లీషు మరియు గురుముఖి(పంజాబీ) భాషలలో ఉన్న విజ్ఞాపన, మసీదు ముందు కాక గురుద్వారా ముందు చూసి ఇకపై ఆశ్చర్యపోవద్దు! దుబాయి, జెబెల్ అలీ లోనున్న గురుద్వారాలో వరుసగా రెండవ సంవత్సరం కూడా రమదాన్ పాటింపబడుతున్న సత్సాంప్రదాయంలో, ఈ సంవత్సరం జులై 22 ఇఫ్తార్ నాటి ప్రత్యేక సందర్భానికి గౌరవ అతిధులుగా, ప్రముఖ ఇస్లాం వక్త - అహ్మద్ హమిద్, అల్ మానార్ సెంటర్ ప్రతినిధి అబ్దుల్ హాదీ రానున్నారు.
ఈ విషయమై హమిద్ మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ దైవoపై నమ్మకాన్ని పంచి ఇవ్వడానికి ఇదే ఉత్తమ సమయమని బోధించారు. ఈ కార్యక్రమానికి 20 మంది ఇతర ముస్లిం మిత్రులను, మూడు చర్చిల సభ్యులను, క్రిస్టియన్లను కూడా ఆహ్వానించిన గురునానక్ దర్బార్ యొక్క ఛైర్మన్ శ్రీ సురిందర్ సింగ్ కాంధారీ, దేవునికి తమనుతాము అర్పించుకోవడం గురించిన హమీద్ గారి ప్రసంగాన్ని ప్రశంసించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







