జెబెల్ అలీ గురుద్వారాలో పవిత్ర ఖురాన్ పఠనం!
- June 24, 2015
"దయచేసి రమదాన్ దినాలలో లoగరు (ప్రసాదం) పార్సిల్ ను అడగవద్దు" - అని సూచించే ఇంగ్లీషు మరియు గురుముఖి(పంజాబీ) భాషలలో ఉన్న విజ్ఞాపన, మసీదు ముందు కాక గురుద్వారా ముందు చూసి ఇకపై ఆశ్చర్యపోవద్దు! దుబాయి, జెబెల్ అలీ లోనున్న గురుద్వారాలో వరుసగా రెండవ సంవత్సరం కూడా రమదాన్ పాటింపబడుతున్న సత్సాంప్రదాయంలో, ఈ సంవత్సరం జులై 22 ఇఫ్తార్ నాటి ప్రత్యేక సందర్భానికి గౌరవ అతిధులుగా, ప్రముఖ ఇస్లాం వక్త - అహ్మద్ హమిద్, అల్ మానార్ సెంటర్ ప్రతినిధి అబ్దుల్ హాదీ రానున్నారు.
ఈ విషయమై హమిద్ మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ దైవoపై నమ్మకాన్ని పంచి ఇవ్వడానికి ఇదే ఉత్తమ సమయమని బోధించారు. ఈ కార్యక్రమానికి 20 మంది ఇతర ముస్లిం మిత్రులను, మూడు చర్చిల సభ్యులను, క్రిస్టియన్లను కూడా ఆహ్వానించిన గురునానక్ దర్బార్ యొక్క ఛైర్మన్ శ్రీ సురిందర్ సింగ్ కాంధారీ, దేవునికి తమనుతాము అర్పించుకోవడం గురించిన హమీద్ గారి ప్రసంగాన్ని ప్రశంసించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







