జెబెల్ అలీ గురుద్వారాలో పవిత్ర ఖురాన్ పఠనం!
- June 24, 2015
"దయచేసి రమదాన్ దినాలలో లoగరు (ప్రసాదం) పార్సిల్ ను అడగవద్దు" - అని సూచించే ఇంగ్లీషు మరియు గురుముఖి(పంజాబీ) భాషలలో ఉన్న విజ్ఞాపన, మసీదు ముందు కాక గురుద్వారా ముందు చూసి ఇకపై ఆశ్చర్యపోవద్దు! దుబాయి, జెబెల్ అలీ లోనున్న గురుద్వారాలో వరుసగా రెండవ సంవత్సరం కూడా రమదాన్ పాటింపబడుతున్న సత్సాంప్రదాయంలో, ఈ సంవత్సరం జులై 22 ఇఫ్తార్ నాటి ప్రత్యేక సందర్భానికి గౌరవ అతిధులుగా, ప్రముఖ ఇస్లాం వక్త - అహ్మద్ హమిద్, అల్ మానార్ సెంటర్ ప్రతినిధి అబ్దుల్ హాదీ రానున్నారు.
ఈ విషయమై హమిద్ మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ దైవoపై నమ్మకాన్ని పంచి ఇవ్వడానికి ఇదే ఉత్తమ సమయమని బోధించారు. ఈ కార్యక్రమానికి 20 మంది ఇతర ముస్లిం మిత్రులను, మూడు చర్చిల సభ్యులను, క్రిస్టియన్లను కూడా ఆహ్వానించిన గురునానక్ దర్బార్ యొక్క ఛైర్మన్ శ్రీ సురిందర్ సింగ్ కాంధారీ, దేవునికి తమనుతాము అర్పించుకోవడం గురించిన హమీద్ గారి ప్రసంగాన్ని ప్రశంసించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









