మాతా వైష్ణోదేవి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం
- May 18, 2016
జమ్ముకశ్మీర్లోని రేసీ జిల్లాలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన మాతా వైష్ణోదేవి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. త్రికుల హిల్స్లోని అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని అధికారులు తెలిపారు.సీఆర్పీఎఫ్ అధికారులు రంగంలోకి దిగి.. మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ఆలయానికి కొంత దూరంలో మంటలు చెలరేగుతుండటంతో .. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ల సాయంతో యాత్రికులకు అటవీప్రాంతానికి దూరంగా ఉన్న వైష్ణోదేవి యూనివర్శిటీ క్యాంపస్కు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







