మాతా వైష్ణోదేవి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం

- May 18, 2016 , by Maagulf
మాతా వైష్ణోదేవి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం

జమ్ముకశ్మీర్‌లోని రేసీ జిల్లాలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన మాతా వైష్ణోదేవి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. త్రికుల హిల్స్‌లోని అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని అధికారులు తెలిపారు.సీఆర్‌పీఎఫ్‌ అధికారులు రంగంలోకి దిగి.. మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ఆలయానికి కొంత దూరంలో మంటలు చెలరేగుతుండటంతో .. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ల సాయంతో యాత్రికులకు అటవీప్రాంతానికి దూరంగా ఉన్న వైష్ణోదేవి యూనివర్శిటీ క్యాంపస్‌కు తరలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com