యూఏఈలో ఫుట్‌బాల్ లీగ్ ప్రారంభం. అతిచేసే అభిమానులకు Dh30,000 జరిమానా

- August 18, 2023 , by Maagulf
యూఏఈలో ఫుట్‌బాల్ లీగ్ ప్రారంభం. అతిచేసే అభిమానులకు Dh30,000 జరిమానా

యూఏఈ: యూఏఈలో శుక్రవారం నుంచి టాప్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్(అడ్నాక్ ప్రో లీగ్‌) ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీసులు నిబంధనలను పాటించాలని అభిమానులకు గుర్తు చేశారు. హింసకు పాల్పడే అభిమానులపై 30,000 దిర్హామ్‌ల వరకు జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రొటెక్టివ్ సెక్యూరిటీ అండ్ ఎమర్జెన్సీ డైరెక్టర్ మేజర్-జనరల్ రషీద్ ఖలీఫా అల్ ఫలాసీ అభిమానులు అనుసరించాల్సిన నియమాలను వివరించారు.

అభిమానులు అనుమతి లేకుండా మైదానంలోకి లేదా నియమించబడిన స్పోర్ట్స్ ఈవెంట్ ప్రాంతంలోకి ప్రవేశించడం నిషేధం.  నిషేధిత లేదా ప్రమాదకర పదార్థాలను, ప్రత్యేకించి బాణాసంచా తీసుకురాకూడదు. ఆయుధాలు కలిగి ఉండకూడదు. నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే కూర్చోవాలి.

వర్తించే జరిమానాలు

>> పైన పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒకటి నుండి మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా Dh5,000 - Dh30,000 మధ్య జరిమానా.

>> హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు, పాల్గొన్నందుకు, ప్రేరేపించినందుకు లేదా ప్రయత్నించినందుకు జైలు శిక్ష లేదా Dh10,000 - Dh30,000 మధ్య జరిమానా.

>> ఏ రకమైన పదార్ధాలు లేదా ద్రవాలను విసిరినా పైన పేర్కొన్న విధంగానే జరిమానా ఉంటుంది.

>> అవమానకరమైన భాష (వ్రాసిన లేదా చెప్పిన) ఉపయోగించి లేదా అవమానకరమైన సంజ్ఞలు చేసినందుకు పైన పేర్కొన్న అదే జరిమానా.

>> జాత్యహంకార ప్రకటనలు చేసినందుకు లేదా స్టేడియంను రాజకీయ ప్రయోజనాల కోసం దోపిడీ చేసినందుకు పైన పేర్కొన్న విధంగానే జరిమానా.

స్టేడియంలలోకి ప్రవేశించేటప్పుడు మరియు నిష్క్రమించేటప్పుడు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అభిమానులను అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ మేజర్ జనరల్ అబ్దుల్లా అలీ అల్ ఘైతీ కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com