ఆన్లైన్ మోసాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- August 18, 2023
కువైట్: ఆన్ లైన్ మోసాలపై కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వివిధ సందేహాస్పద సంస్థలు ఆన్లైన్లో మంత్రిత్వ శాఖ ప్రతినిధులుగా పేర్కొంటూ వినియోగదారులను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని హెచ్చరించింది. వెబ్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నకిలీ మంత్రిత్వ శాఖ ఖాతాలను ఉపయోగించే స్కామర్ల కారణంగా పౌరులు, నివాసితులపై మోసపూరిత చర్యలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. మంత్రిత్వ శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయంతో చట్టపరమైన మార్గాల ద్వారా మోసగాళ్లను గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు.. నకిలీ సైట్లు, ఖాతాలను బ్లాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నది. పౌరులు మరియు నివాసితులు నకిలీ ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని, వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) లేదా బ్యాంక్ డేటా కోసం అడిగే సందేశాలకు, కాల్స్ ప్రతిస్పందించకూడదని సూచించింది. సహెల్ అప్లికేషన్లో అన్ని మంత్రిత్వ శాఖ సేవలను పొందవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









