ఆన్లైన్ మోసాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- August 18, 2023
కువైట్: ఆన్ లైన్ మోసాలపై కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వివిధ సందేహాస్పద సంస్థలు ఆన్లైన్లో మంత్రిత్వ శాఖ ప్రతినిధులుగా పేర్కొంటూ వినియోగదారులను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని హెచ్చరించింది. వెబ్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నకిలీ మంత్రిత్వ శాఖ ఖాతాలను ఉపయోగించే స్కామర్ల కారణంగా పౌరులు, నివాసితులపై మోసపూరిత చర్యలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. మంత్రిత్వ శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయంతో చట్టపరమైన మార్గాల ద్వారా మోసగాళ్లను గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు.. నకిలీ సైట్లు, ఖాతాలను బ్లాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నది. పౌరులు మరియు నివాసితులు నకిలీ ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని, వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) లేదా బ్యాంక్ డేటా కోసం అడిగే సందేశాలకు, కాల్స్ ప్రతిస్పందించకూడదని సూచించింది. సహెల్ అప్లికేషన్లో అన్ని మంత్రిత్వ శాఖ సేవలను పొందవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







