ఆన్లైన్ మోసాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- August 18, 2023
కువైట్: ఆన్ లైన్ మోసాలపై కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వివిధ సందేహాస్పద సంస్థలు ఆన్లైన్లో మంత్రిత్వ శాఖ ప్రతినిధులుగా పేర్కొంటూ వినియోగదారులను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని హెచ్చరించింది. వెబ్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నకిలీ మంత్రిత్వ శాఖ ఖాతాలను ఉపయోగించే స్కామర్ల కారణంగా పౌరులు, నివాసితులపై మోసపూరిత చర్యలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. మంత్రిత్వ శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయంతో చట్టపరమైన మార్గాల ద్వారా మోసగాళ్లను గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు.. నకిలీ సైట్లు, ఖాతాలను బ్లాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నది. పౌరులు మరియు నివాసితులు నకిలీ ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని, వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) లేదా బ్యాంక్ డేటా కోసం అడిగే సందేశాలకు, కాల్స్ ప్రతిస్పందించకూడదని సూచించింది. సహెల్ అప్లికేషన్లో అన్ని మంత్రిత్వ శాఖ సేవలను పొందవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







