హిద్ వర్క్సైట్లో ఆసియా కార్మికుడి మృతి
- May 18, 2016
హిద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని వర్క్ సైట్లో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అరేబియన్ షిప్ రిపెయిర్స్ యార్డ్, ఓ పత్రికా ప్రకటనలో ప్రమాదం గురించిన వివరాల్ని తెలియజేసింది. మృతి చెందిన కార్మికుడు బంగ్లాదేష్ జాతీయుడిగా గుర్తించారు. డ్రై డాక్ యార్డ్లో కార్మికుడు పనిచేస్తుండగా ప్రమావశాత్తూ వెస్సెల్ కూలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడ్డ అతనికి తక్షణ వైద్య చికిత్స అందించినా, ప్రాణాలు కాపాడలేకపోయామని సంస్థ ప్రకటించింది. ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని అరేబియన్ షిప్ యార్డ్ రిపెయిర్స్ కంపెనీ ప్రతినిథులు చెప్పారు. తమ సంస్థలో భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ, దురదృష్టవశాత్తూ ఈ సంఘటన జరిగిందనీ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టియన్ బెర్జ్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









