హిద్ వర్క్సైట్లో ఆసియా కార్మికుడి మృతి
- May 18, 2016
హిద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని వర్క్ సైట్లో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అరేబియన్ షిప్ రిపెయిర్స్ యార్డ్, ఓ పత్రికా ప్రకటనలో ప్రమాదం గురించిన వివరాల్ని తెలియజేసింది. మృతి చెందిన కార్మికుడు బంగ్లాదేష్ జాతీయుడిగా గుర్తించారు. డ్రై డాక్ యార్డ్లో కార్మికుడు పనిచేస్తుండగా ప్రమావశాత్తూ వెస్సెల్ కూలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడ్డ అతనికి తక్షణ వైద్య చికిత్స అందించినా, ప్రాణాలు కాపాడలేకపోయామని సంస్థ ప్రకటించింది. ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని అరేబియన్ షిప్ యార్డ్ రిపెయిర్స్ కంపెనీ ప్రతినిథులు చెప్పారు. తమ సంస్థలో భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ, దురదృష్టవశాత్తూ ఈ సంఘటన జరిగిందనీ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టియన్ బెర్జ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







