ఖతార్ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు అరెస్ట్
- August 19, 2023
దోహా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్లోని అనేక మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అక్రమార్జన, విధులను దుర్వినియోగం చేయడం, ప్రజా ధనానికి నష్టం కలిగించడం వంటి నేరాలకు పాల్పడినందుకు అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. నిందితులకు వ్యతిరేకంగా అవసరమైన సాక్ష్యాలను సేకరించిన తర్వాతనే వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు తెలిపింది. 2004 నాటి చట్టం నెం. 11లోని ఆర్టికల్ 148 ప్రకారం.. ప్రభుత్వ అధికారిగా ఉండి తన ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి అతని వద్ద ఉన్న డబ్బు, కాగితాలు లేదా ఇతరులను అపహరించిన వ్యక్తికి 5-10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది. అదే నిధులను దుర్వినియోగం చేయడం, తన స్వార్థానికి వాడుకోవడం లాంటి నేరాలకు పాల్పడిన సందర్భంగా 7-15 ఏళ్ల మధ్య జైలుశిక్ష, నిధుల రికవరీతోపాటు భారీ జరిమానావిధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







