ఖతార్ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు అరెస్ట్
- August 19, 2023
దోహా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్లోని అనేక మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అక్రమార్జన, విధులను దుర్వినియోగం చేయడం, ప్రజా ధనానికి నష్టం కలిగించడం వంటి నేరాలకు పాల్పడినందుకు అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. నిందితులకు వ్యతిరేకంగా అవసరమైన సాక్ష్యాలను సేకరించిన తర్వాతనే వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు తెలిపింది. 2004 నాటి చట్టం నెం. 11లోని ఆర్టికల్ 148 ప్రకారం.. ప్రభుత్వ అధికారిగా ఉండి తన ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి అతని వద్ద ఉన్న డబ్బు, కాగితాలు లేదా ఇతరులను అపహరించిన వ్యక్తికి 5-10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది. అదే నిధులను దుర్వినియోగం చేయడం, తన స్వార్థానికి వాడుకోవడం లాంటి నేరాలకు పాల్పడిన సందర్భంగా 7-15 ఏళ్ల మధ్య జైలుశిక్ష, నిధుల రికవరీతోపాటు భారీ జరిమానావిధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!







