కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ను ప్రకటించిన దుబాయ్
- August 19, 2023
దుబాయ్: కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ ను దుబాయ్ ప్రకటించింది. GCC నివాసితుల కోసం దుబాయ్ ఆన్లైన్ ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ను ప్రారంభించింది. GCC నివాసితులు ఇప్పుడు యూఏఈ ప్రవేశ అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్-దుబాయ్ (GDRFA) వెల్లడించింది.
GDRFA ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కొత్త ప్రవేశ అనుమతి కోసం అవసరమైన పత్రాల వివరాలను పేర్కొంది. అసలు పాస్పోర్ట్, GCC దేశం జారీ చేసిన అసలు నివాస అనుమతి పత్రం, పౌర లేదా లేబర్ కార్డ్ అవసరం అవుతాయి. GDRFAD వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ను పూర్తి చేసి ఫీజు చెల్లించాలి. దీనికి VAT (5 శాతం)తో AED250 ఖర్చవుతుంది. అయితే, GCC నివాసి తప్పనిసరిగా కొన్ని షరతులను పాటించాలి. విదేశీయుడు కనీసం ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే నివాస అనుమతిని కలిగి ఉండాలి. ప్రయాణికుడిని దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించే ఆంక్షలు ఉండకూడదు. పని లేదా రెసిడెన్సీ కార్డ్లో వృత్తిని చేర్చాలి. కొత్త సేవలు 24 గంటలు.. వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటాయి. కనీసం 48 గంటల ప్రాసెసింగ్ సమయం పడుతుందని GDRFA తన పోస్ట్ లో వివరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









