కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ను ప్రకటించిన దుబాయ్
- August 19, 2023
దుబాయ్: కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ ను దుబాయ్ ప్రకటించింది. GCC నివాసితుల కోసం దుబాయ్ ఆన్లైన్ ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ను ప్రారంభించింది. GCC నివాసితులు ఇప్పుడు యూఏఈ ప్రవేశ అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్-దుబాయ్ (GDRFA) వెల్లడించింది.
GDRFA ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కొత్త ప్రవేశ అనుమతి కోసం అవసరమైన పత్రాల వివరాలను పేర్కొంది. అసలు పాస్పోర్ట్, GCC దేశం జారీ చేసిన అసలు నివాస అనుమతి పత్రం, పౌర లేదా లేబర్ కార్డ్ అవసరం అవుతాయి. GDRFAD వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ను పూర్తి చేసి ఫీజు చెల్లించాలి. దీనికి VAT (5 శాతం)తో AED250 ఖర్చవుతుంది. అయితే, GCC నివాసి తప్పనిసరిగా కొన్ని షరతులను పాటించాలి. విదేశీయుడు కనీసం ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే నివాస అనుమతిని కలిగి ఉండాలి. ప్రయాణికుడిని దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించే ఆంక్షలు ఉండకూడదు. పని లేదా రెసిడెన్సీ కార్డ్లో వృత్తిని చేర్చాలి. కొత్త సేవలు 24 గంటలు.. వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటాయి. కనీసం 48 గంటల ప్రాసెసింగ్ సమయం పడుతుందని GDRFA తన పోస్ట్ లో వివరించింది.
తాజా వార్తలు
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!







