కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ను ప్రకటించిన దుబాయ్
- August 19, 2023
దుబాయ్: కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ ను దుబాయ్ ప్రకటించింది. GCC నివాసితుల కోసం దుబాయ్ ఆన్లైన్ ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ను ప్రారంభించింది. GCC నివాసితులు ఇప్పుడు యూఏఈ ప్రవేశ అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్-దుబాయ్ (GDRFA) వెల్లడించింది.
GDRFA ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కొత్త ప్రవేశ అనుమతి కోసం అవసరమైన పత్రాల వివరాలను పేర్కొంది. అసలు పాస్పోర్ట్, GCC దేశం జారీ చేసిన అసలు నివాస అనుమతి పత్రం, పౌర లేదా లేబర్ కార్డ్ అవసరం అవుతాయి. GDRFAD వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ను పూర్తి చేసి ఫీజు చెల్లించాలి. దీనికి VAT (5 శాతం)తో AED250 ఖర్చవుతుంది. అయితే, GCC నివాసి తప్పనిసరిగా కొన్ని షరతులను పాటించాలి. విదేశీయుడు కనీసం ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే నివాస అనుమతిని కలిగి ఉండాలి. ప్రయాణికుడిని దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించే ఆంక్షలు ఉండకూడదు. పని లేదా రెసిడెన్సీ కార్డ్లో వృత్తిని చేర్చాలి. కొత్త సేవలు 24 గంటలు.. వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటాయి. కనీసం 48 గంటల ప్రాసెసింగ్ సమయం పడుతుందని GDRFA తన పోస్ట్ లో వివరించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







