త్వరలో భారత్‌కు ఇజ్రాయెల్‌ హోటల్‌..

- May 18, 2016 , by Maagulf
త్వరలో భారత్‌కు  ఇజ్రాయెల్‌ హోటల్‌..

ఇజ్రాయెల్‌లోని ప్రముఖ గొలుసు హోటళ్లలో ఒకటైన డాన్‌ హోటల్స్‌ త్వరలో భారత్‌కు రానుంది. బెంగళూరులో తమ తొలి విదేశీ వెంచర్‌ను ప్రారంభించనున్నట్లు హోటల్‌ సీఈవో రఫీ సాదే తెలిపారు. 230 గదులతో ఈ హోటల్‌ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మరో 10-12 నెలల్లో హోటల్‌ను ప్రారంభిస్తామని రఫీ తెలిపారు.ఇజ్రాయెల్‌కి చెందిన అనేక హైటెక్‌ కంపెనీలు బెంగళూరులో ఉండటంతో.. హోటల్‌ వ్యాపారం పెరుగుతుందన్నారు. త్వరలోనే భారత్‌ వ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పారు. భారత్‌లో హోటల్‌ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని.. దేశ ప్రభుత్వం, స్థానిక అధికారుల నుంచి తమకు అన్నివిధాల సహకారం అందుతోందని.. హోటల్‌ నిర్మాణ పనులను పర్యవేక్షించే గిది ఫెడర్‌మన్‌ తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com