బహ్రెయిన్-భారత సంబంధాల వృద్ధిపై ప్రశంసలు
- August 26, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్-భారత్ మధ్య అన్ని స్థాయిలలో ద్వైపాక్షిక సహకారం స్థిరమైన వృద్ధిని బహ్రెయిన్లో భారత రాయబారిగా నియమితులైన వినోద్ కె. జాకబ్ కొనియాడారు. రెండు దేశాలు, ప్రజల మధ్య దృఢమైన దీర్ఘకాలిక స్నేహ సంబంధాలున్నాయని తెలిపారు. బహ్రెయిన్ సాంఘిక అభివృద్ధి మంత్రి ఒసామా బిన్ అహ్మద్ ఖలాఫ్ అల్ అస్ఫూర్ అంబాసిడర్ జాకబ్కు స్వాగతం పలికారు. తన దౌత్య బాధ్యతలను నిర్వహించడంలో రాయబారి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉమ్మడి సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అన్ని రకాల మద్దతును అందించడానికి సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంసిద్ధతను వ్యక్తం చేశారు. బహ్రెయిన్లోని భారతీయ ప్రవాస కమ్యూనిటీ చూపుతున్న శ్రద్ధ, ఆసక్తిని అంబాసిడర్ ప్రశంసించారు. రెండు దేశాల ఉమ్మడి ఆకాంక్షలను సాధించడానికి ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







