బహ్రెయిన్-భారత సంబంధాల వృద్ధిపై ప్రశంసలు
- August 26, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్-భారత్ మధ్య అన్ని స్థాయిలలో ద్వైపాక్షిక సహకారం స్థిరమైన వృద్ధిని బహ్రెయిన్లో భారత రాయబారిగా నియమితులైన వినోద్ కె. జాకబ్ కొనియాడారు. రెండు దేశాలు, ప్రజల మధ్య దృఢమైన దీర్ఘకాలిక స్నేహ సంబంధాలున్నాయని తెలిపారు. బహ్రెయిన్ సాంఘిక అభివృద్ధి మంత్రి ఒసామా బిన్ అహ్మద్ ఖలాఫ్ అల్ అస్ఫూర్ అంబాసిడర్ జాకబ్కు స్వాగతం పలికారు. తన దౌత్య బాధ్యతలను నిర్వహించడంలో రాయబారి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉమ్మడి సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అన్ని రకాల మద్దతును అందించడానికి సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంసిద్ధతను వ్యక్తం చేశారు. బహ్రెయిన్లోని భారతీయ ప్రవాస కమ్యూనిటీ చూపుతున్న శ్రద్ధ, ఆసక్తిని అంబాసిడర్ ప్రశంసించారు. రెండు దేశాల ఉమ్మడి ఆకాంక్షలను సాధించడానికి ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







