బహ్రెయిన్-భారత సంబంధాల వృద్ధిపై ప్రశంసలు
- August 26, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్-భారత్ మధ్య అన్ని స్థాయిలలో ద్వైపాక్షిక సహకారం స్థిరమైన వృద్ధిని బహ్రెయిన్లో భారత రాయబారిగా నియమితులైన వినోద్ కె. జాకబ్ కొనియాడారు. రెండు దేశాలు, ప్రజల మధ్య దృఢమైన దీర్ఘకాలిక స్నేహ సంబంధాలున్నాయని తెలిపారు. బహ్రెయిన్ సాంఘిక అభివృద్ధి మంత్రి ఒసామా బిన్ అహ్మద్ ఖలాఫ్ అల్ అస్ఫూర్ అంబాసిడర్ జాకబ్కు స్వాగతం పలికారు. తన దౌత్య బాధ్యతలను నిర్వహించడంలో రాయబారి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉమ్మడి సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అన్ని రకాల మద్దతును అందించడానికి సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంసిద్ధతను వ్యక్తం చేశారు. బహ్రెయిన్లోని భారతీయ ప్రవాస కమ్యూనిటీ చూపుతున్న శ్రద్ధ, ఆసక్తిని అంబాసిడర్ ప్రశంసించారు. రెండు దేశాల ఉమ్మడి ఆకాంక్షలను సాధించడానికి ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







