గార పట్టిన పళ్లు తెల్లగా మారాలంటే, వెల్లుల్లితో ఇలా చేసి చూడండి.!
- September 04, 2023
దంతాలు ఆరోగ్యంగా వుంటేనే మనం ఆరోగ్యంగా వుండగలం. మంచి ఆహారం తీసుకోవాలంటే దంతాలు ఆరోగ్యంగా వుండాలి. అందుకే పళ్ల సమస్యల్ని అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
కొందరిలో చిగురు వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వేధిస్తుంటాయ్. కానీ, వాటిని అలాగే వదిలేస్తుంటారు. అలాగే, దంతాలకు గార పట్టి, నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయినా పట్టించుకోరు.
ఈ సమస్యలున్నవారు ఖచ్చితంగా వైద్య చికిత్స తీసుకోవాలి. అంతకు ముందే కిచెన్లో వుండే సాధారణ పదార్ధాలతో పంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చని సంబంధింత నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లిలో యాంటిబయాటిక్స్ పుష్కలంగా వుంటాయ్. ఇది ఆహారంలో వాడడమే కాదు, పంటి సమస్యల్ని దూరం చేసుకోవడానికి కూడా మంచి దోహదకారి.
నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని కాస్త అటూ ఇటూగా చితక్కొట్టి, అందులో కొద్దిగా బేకింగ్ సోడా, టమాటా రసం కలిపి రెగ్యులర్గా యూజ్ చేసే టూత్ పేస్ట్తో కలిపి మిశ్రమంలా చేసి బ్రష్పై వేసి తోముకోవాలి. ఇలా డైలీ చేస్తే చాలా మంచిది. లేదంటే, వారంలో నాలుగైదు సార్లు చేసినా మంచి ఫలితం వుంటుంది. గార పట్టిన పళ్లు తెల్లగా మారడంతో పాటూ, చిగురు సమస్యలూ నివారించబడతాయ్.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







