గార పట్టిన పళ్లు తెల్లగా మారాలంటే, వెల్లుల్లితో ఇలా చేసి చూడండి.!
- September 04, 2023
దంతాలు ఆరోగ్యంగా వుంటేనే మనం ఆరోగ్యంగా వుండగలం. మంచి ఆహారం తీసుకోవాలంటే దంతాలు ఆరోగ్యంగా వుండాలి. అందుకే పళ్ల సమస్యల్ని అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
కొందరిలో చిగురు వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వేధిస్తుంటాయ్. కానీ, వాటిని అలాగే వదిలేస్తుంటారు. అలాగే, దంతాలకు గార పట్టి, నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయినా పట్టించుకోరు.
ఈ సమస్యలున్నవారు ఖచ్చితంగా వైద్య చికిత్స తీసుకోవాలి. అంతకు ముందే కిచెన్లో వుండే సాధారణ పదార్ధాలతో పంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చని సంబంధింత నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లిలో యాంటిబయాటిక్స్ పుష్కలంగా వుంటాయ్. ఇది ఆహారంలో వాడడమే కాదు, పంటి సమస్యల్ని దూరం చేసుకోవడానికి కూడా మంచి దోహదకారి.
నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని కాస్త అటూ ఇటూగా చితక్కొట్టి, అందులో కొద్దిగా బేకింగ్ సోడా, టమాటా రసం కలిపి రెగ్యులర్గా యూజ్ చేసే టూత్ పేస్ట్తో కలిపి మిశ్రమంలా చేసి బ్రష్పై వేసి తోముకోవాలి. ఇలా డైలీ చేస్తే చాలా మంచిది. లేదంటే, వారంలో నాలుగైదు సార్లు చేసినా మంచి ఫలితం వుంటుంది. గార పట్టిన పళ్లు తెల్లగా మారడంతో పాటూ, చిగురు సమస్యలూ నివారించబడతాయ్.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







