గార పట్టిన పళ్లు తెల్లగా మారాలంటే, వెల్లుల్లితో ఇలా చేసి చూడండి.!
- September 04, 2023
దంతాలు ఆరోగ్యంగా వుంటేనే మనం ఆరోగ్యంగా వుండగలం. మంచి ఆహారం తీసుకోవాలంటే దంతాలు ఆరోగ్యంగా వుండాలి. అందుకే పళ్ల సమస్యల్ని అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
కొందరిలో చిగురు వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వేధిస్తుంటాయ్. కానీ, వాటిని అలాగే వదిలేస్తుంటారు. అలాగే, దంతాలకు గార పట్టి, నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయినా పట్టించుకోరు.
ఈ సమస్యలున్నవారు ఖచ్చితంగా వైద్య చికిత్స తీసుకోవాలి. అంతకు ముందే కిచెన్లో వుండే సాధారణ పదార్ధాలతో పంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చని సంబంధింత నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లిలో యాంటిబయాటిక్స్ పుష్కలంగా వుంటాయ్. ఇది ఆహారంలో వాడడమే కాదు, పంటి సమస్యల్ని దూరం చేసుకోవడానికి కూడా మంచి దోహదకారి.
నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని కాస్త అటూ ఇటూగా చితక్కొట్టి, అందులో కొద్దిగా బేకింగ్ సోడా, టమాటా రసం కలిపి రెగ్యులర్గా యూజ్ చేసే టూత్ పేస్ట్తో కలిపి మిశ్రమంలా చేసి బ్రష్పై వేసి తోముకోవాలి. ఇలా డైలీ చేస్తే చాలా మంచిది. లేదంటే, వారంలో నాలుగైదు సార్లు చేసినా మంచి ఫలితం వుంటుంది. గార పట్టిన పళ్లు తెల్లగా మారడంతో పాటూ, చిగురు సమస్యలూ నివారించబడతాయ్.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









