ఉద్యోగుల కోసం కొత్త ఎండ్-ఆఫ్-సర్వీస్ బెనిఫిట్స్ సిస్టమ్
- September 05, 2023
యూఏఈ: ప్రైవేట్ సెక్టార్, ఫ్రీ జోన్లలోని ఉద్యోగులు కోసం ఎండ్-ఆఫ్-సర్వీస్ ప్రయోజనాలను పెట్టుబడి పెట్టడానికి కొత్త విధానాన్ని యూఏఈ క్యాబినెట్ ప్రకటించింది. ఈ వ్యవస్థ సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ను ఏర్పాటు చేస్తుంది. దీనిని సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ సమన్వయంతో పర్యవేక్షిస్తుంది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. "కార్మికుల పొదుపులను సంరక్షించడం.. వారు సురక్షితంగా పెట్టుబడి పెట్టేలా చూడడమే లక్ష్యం" అని షేక్ మహమ్మద్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకంలో పాలుపంచుకోవచ్చని యూఏఈ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. యూఏఈలోని ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు గ్రాట్యుటీని అందుకుంటారు. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం గడిపిన వారు ఈ సేవా ముగింపు ప్రయోజనానికి అర్హులు. యజమానులు తమ కార్మికులను - వారి వృత్తిపరమైన స్థాయిలతో సంబంధం లేకుండా - కొత్త సిస్టమ్లో నమోదు చేయవచ్చు.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







