తిరుమల వెంకన్నను దర్శించుకున్న షారుఖ్!
- September 05, 2023
తిరుమల: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తె సుహానాఖాన్, భార్య గౌరీ ఖాన్, నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత (TTD) సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుక్కు స్వాగతం పలికి స్వామి సేవ, దర్శనం ఏర్పాటు చేశారు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన ‘ జవాన్’ చిత్రం ఈ నోల 7వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. జనవరిలో ‘పఠాన్’ చిత్రంతో రికార్డులు సృష్టించిన షారుఖ్ ‘జవాన్తోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్తో సినిమాకుపై అంచనాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే!
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







