బహ్రెయిన్లో పెట్ ఫుడ్ స్టోర్స్ వర్సెస్ కోల్డ్ స్టోర్లు..!!
- September 06, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లో పెంపుడు జంతువుల ఆహారాన్ని విక్రయించే కోల్డ్ స్టోర్లు, ప్రత్యేకమైన పెట్ ఫుడ్ స్టోర్ల మధ్య పోటీ నడుస్తోంది. తమ వ్యాపారానికి తీవ్ర నష్టం చేస్తున్న కోల్డ్ స్టోర్ లపై చర్యలు తీసుకోవాలని పెట్ ఫుడ్ స్టోర్స్ యజమానులు కోరుతున్నారు. తమ ఉపాధిని దెబ్బతీస్తున్న కోల్డ్ స్టోర్లలో పెట్ ఫుడ్ విక్రయాను పరిమితం చేయడానికి ప్రభుత్వ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అయితే, సౌలభ్యం మరియు యాక్సెస్ సదుపాయాల కారణంగా వినియోగదారులు కోల్డ్ స్టోర్లకు మొగ్గుచూపుతున్నారని వాటి నిర్వాహకులు వాదిస్తున్నారు. హూరాలో పెట్ ఫాంటసీని నడుపుతున్న ఇర్షాద్ ఇష్తియాక్ మాట్లాడుతూ.. అన్యాయమైన పోటీ కారణంగా ఖర్చులు పెరిగి, ఆదాయం లేకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయని, గత నెలలో BD150 మాత్రమే వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. పెట్ ఉత్పత్తులు వివిధ మార్కెట్లు, సాధారణ కోల్డ్ స్టోర్లలో సులభంగా లభిస్తున్నాయని, కాబట్టి పెట్ షాప్ యజమానులు అద్దె, విద్యుత్, జీతాలు వంటి ఖర్చులను భరించడం మరియు ఆపై లాభం పొందడం సవాలుగా మారిందని ఆమె వాపోయారు. పెరుగుతున్న ఖర్చులు మరియు అన్యాయమైన పోటీ కారణంగా తగినంత ఆదాయం లేకపోవడంతో అనేక పెట్ ఫుడ్ దుకాణాలను మూసివేయవలసి వచ్చిందని ఆమె పేర్కొంది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







