ఎమిరేట్లో 23,600 ఉచిత వై-ఫై హాట్స్పాట్లు
- September 07, 2023
దుబాయ్: దుబాయ్ 23,600 ఉచిత Wi-Fi స్పాట్ల విస్తృత నెట్వర్క్ను కలిగి ఉందని అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ ప్రదేశాలు విభిన్న సౌకర్యాల శ్రేణిలో ఉన్నాయని తెలిపారు. నివాసితులు, సందర్శకులు పార్కులు, బీచ్లు, మాల్స్ మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో ఉచిత ఇంటర్నెట్ని పొందవచ్చని పేర్కొన్నారు. దుబాయ్ డిజిటల్ అథారిటీ ఎమిరేట్ యొక్క డిజిటల్ ప్రణాళికలను ప్రకటించింది. 2000లో తన ఇ-గవర్నమెంట్ చొరవను ప్రారంభించింది. 2013లో స్మార్ట్ గవర్నమెంట్ సమగ్ర డిజిటల్ ప్రోగ్రామ్ లో భాగంగా 2021 చివరి నాటికి పేపర్ లావాదేవీలను తొలగించింది. దుబాయ్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచానికి ప్రపంచ రాజధానిగా మారేందుకు కృషి చేస్తోంది. ప్రభుత్వ సేవలు 99.5 శాతానికి డిజిటలైజేషన్కు చేరుకున్నాయి. కాగిత రహిత ప్రభుత్వ లక్ష్యం 100 శాతం నెరవేరింది. మొత్తం ప్రభుత్వ సేవల లావాదేవీల్లో ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు 87 శాతంగా ఉన్నాయి. 120 కంటే ఎక్కువ ప్రభుత్వ స్మార్ట్ఫోన్ అప్లికేషన్లు అభివృద్ధి చేయబడ్డాయని తన డిజిటల్ ప్రణాళికలో దుబాయ్ అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







